మార్చి 22వ తేదిన పుష్పయాగ మహోత్సవము

మార్చి 22వ తేదిన పుష్పయాగ మహోత్సవము

తిరుపతి మార్చి-12, 2009: శ్రీనివాసామంగాపురంలోనున్న శ్రీ కల్యాణవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మార్చి 22వ తేదిన పుష్పయాగమహోత్సవమును కన్నులపండుగగా నిర్వహిస్తారు. అంకురార్పణం మార్చి21న నిర్వహిస్తారు.

ఈ సందర్భంగా మార్చి 21వ తేదిన సేనాధిపతి ఉత్సవం అంకురార్పణం, మార్చి 22వ తేదిన ఉదయం 9.30గంటలకు ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం మధ్యాహ్నం 2.45 గంటల నుండి సాయంత్రం 5.00 గంటల వరకు పుష్పయాగం, సాయంత్రం 7.00 గంటలకు ఊంజలేసేవ, వీధిఉత్సవం నిర్వహిస్తారు.

ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.