NRUSIMHA JAYANTI ON MAY 4 _ మే 4న తిరుమల‌లో శ్రీ నృసింహ జయంతి

TIRUMALA, 27 APRIL 2023: The auspicious Nrusimha Jayanti will be observed in Tirumala on May by TTD. 

 

Every year on the advent of Swati star in Vaisakha month this Jayanti is being observed. 

 

In the sub-temple of Sri Yoga Narasimha Swamy inside the Tirumala temple, special pujas will be performed.

 

At Vasanta Mandapam, Nrusimha Puja will be observed between 3pm and 4.30pm. 

 
SVBC will telecast this programme live for the sake of global devotees.

 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

మే 4న తిరుమల‌లో శ్రీ నృసింహ జయంతి

తిరుమల, 27 ఏప్రిల్ 2023: తిరుమల‌ శ్రీవారి ఆల‌యంలో మే 4న నృసింహ జయంతి జరుగనుంది. ప్రతి ఏటా వైశాఖ మాసం స్వాతి నక్షత్రంలో నృసింహ జయంతిని నిర్వహిస్తారు. శ్రీ యోగ నరసింహస్వామివారి మూల‌మూర్తికి ఈ సందర్భంగా ప్రత్యేక అభిషేకం చేస్తారు.

వసంత మండపంలో శ్రీ నరసింహస్వామి వారి పూజ

వైశాఖ మాస ఉత్సవాల్లో భాగంగా తిరుమల‌ వసంత మండపంలో మ‌ధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 4.30 గంటల‌ వరకు శ్రీ నరసింహస్వామి వారి పూజ నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాన్ని శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్‌ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది.

ఆల‌య ప్రాశస్త్యం :

శ్రీవారి ఆల‌య మొదటి ప్రాకారంలో గర్భాల‌యానికి ఈశాన్యం వైపున గల‌ మండపంలో పడమరగా శ్రీ యోగ నరసింహస్వామివారి ఉప ఆల‌యం ఉంది. శ్రీ యోగ నరసింహస్వామివారి విగ్రహాన్ని శాస్త్ర ప్రకారం రూపొందించారు. ఇక్కడ స్వామివారు యోగముద్రలో ఉంటారు. స్వామివారికి నాలుగు చేతులుంటాయి. పైభాగంలో ఉన్న చేతుల్లో శంఖుచక్రాలు కనిపిస్తాయి. కింది రెండు చేతులు ధ్యాననిష్టను సూచిస్తాయి. క్రీ.శ 1330 నుంచి క్రీ.శ 1360 మధ్య కాలంలో నిర్మితమైన ఈ ఆల‌యంలో శ్రీ రామానుజాచార్యుల‌ వారు శ్రీ యోగ నరసింహస్వామివారి విగ్రహాన్ని ప్రతిష్టించారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.