NARASIMHA JAYANTI ON MAY 4 _ మే 4న శ్రీ నృసింహ జయంతి 

TIRUMALA, 03 MAY 2023: The Narasimha Jayanti will be observed in Tirumala temple on May 4 in the sub temple of Sri Yoga Narasimha Swamy.

In the advent of Swati Nakshatram, the birth star of Narasimha Swamy, every year TTD observes this fete.

At Vasanta Mandapam, special puja to Sri Narasimha Swamy will be observed between 3pm and 4:30pm which will be live telecasted on SVBC.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

మే 4న శ్రీ నృసింహ జయంతి

తిరుమల, 2023 మే 03: తిరుమల శ్రీవారి ఆలయంలో మే 4న నృసింహ జయంతిని ఘనంగా నిర్వహిస్తారు. ప్రతి ఏటా వైశాఖ మాసం స్వాతి నక్షత్రంలో ఈ ఉత్సవం చేపడతారు. శ్రీ యోగ నరసింహస్వామివారి మూలమూర్తికి ఈ సందర్భంగా ప్రత్యేక అభిషేకం చేస్తారు.

నారాయణగిరి ఉద్యానవనాల్లో వెంగమాంబ జయంతి అనంతరం ఉభయనాంచారులతో కలిసి శ్రీ మలయప్పస్వామివారు తిరిగి ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి చేరుకుంటారు. ఆ తరువాత శ్రీ యోగ నరసింహస్వామివారికి అభిషేకం నిర్వహిస్తారు.

శ్రీవారి ఆలయ మొదటి ప్రాకారంలో గర్భాలయానికి ఈశాన్యం వైపున గల మండపంలో పడమరగా శ్రీ యోగ నరసింహస్వామివారి ఉప ఆలయం ఉంది. యోగముద్రలో ఉన్న ఈ విగ్రహాన్ని శాస్త్ర ప్రకారం రూపొందించారు. స్వామివారికి నాలుగు చేతులుంటాయి. పైభాగంలో ఉన్న చేతులలో శంఖుచక్రాలు కనిపిస్తాయి. కింది రెండు చేతులు ధ్యాననిష్టను సూచిస్తాయి. క్రీ.శ 1330 నుంచి క్రీ.శ 1360 మధ్య కాలంలో నిర్మితమైన ఈ ఆలయంలో శ్రీ రామానుజాచార్యుల వారు శ్రీ యోగ నరసింహస్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఇక్కడి స్వామివారు సగభాగం మానవ రూపంలోనూ, మరో సగభాగం శ్రీవారి అవతారమైన సింహం రూపంలోనూ ఉంటారు.

వసంత మండపంలో శ్రీ నరసింహస్వామి వారి పూజ :

వైశాఖ మాస ఉత్సవాల్లో భాగంగా తిరుమల‌ వసంత మండపంలో మ‌ధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 4.30 గంటల‌ వరకు శ్రీ నరసింహస్వామి వారి పూజ నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాన్ని శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్‌ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.