వైభవంగా శ్రీ కపిలేశ్వరస్వామివారి పవిత్రోత్సవాలు

వైభవంగా శ్రీ కపిలేశ్వరస్వామివారి పవిత్రోత్సవాలు

తిరుపతి, 2012 జూలై 01: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా రెండో రోజైన ఆదివారం ఉదయం 8.00 గంటల నుండి మధ్యాహ్నం 12.00 గంటల వరకు పవిత్ర మండల పూజ ఘనంగా నిర్వహించారు. సాయంత్రం 5.30 గంటల నుండి రాత్రి 8.00 గంటల వరకు ఉత్సవమూర్తులకు విశేష ఉపచారములు చేయనున్నారు.

ఈ కార్యక్రమంలో తితిదే స్థానిక ఆలయాల ఉప కార్యనిర్వహణాధికారి శ్రీ చిన్నస్వామి,  సహాయ కార్యనిర్వహణాధికారి శ్రీ సుబ్రమణ్యం, సూపరింటెండెంట్‌ శ్రీ మునిసురేష్‌రెడ్డి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీ శ్రీనివాసులు, ప్రధాన అర్చకులు శ్రీ స్వామినాధ్‌ గురుకుల్‌, ఉమాశంకర్‌ గురుకుల్‌, మణివాసగురుకుల్‌, చంథ్రేఖర్‌ గురుకుల్‌, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.