SNAPANA TIRUMANJANAM HELD _ వైభవంగా శ్రీ భూ సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామివారి స్నపన తిరుమంజనం

Tirupati, 26 Feb. 22: Snapana Tirumanjanam was performed to the Utsava Murthies of Sridevi Bhudevi sameta Sri Kalyana Venkateswara Swamy in Srinivasa Mangapuram on Saturday.

This ritual took place in the Kalyanotsava Mandapam between 10:30am and 11:30am.

Temple Archaka Sri Balaji Rangacharyulu performed the holy bath to the deities.

JEO Sri Veerabrahmam, Temple DyEO Smt Shanti, AEO Sri Gurumurthy, Superintendent Sri Chengalrayalu were present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

వైభవంగా శ్రీ భూ సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామివారి స్నపన తిరుమంజనం

తిరుపతి, 2022 ఫిబ్రవరి 26: శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి, అమ్మవార్లకు శనివారం స్నపన తిరుమంజనం శోభాయమానంగా జరిగింది. ఉదయం 10.30 నుండి 11.30 గంటల వరకు ఆలయంలోని కల్యాణ మండపంలో ఈ వేడుక వైభవంగా జరిగింది.

ఆల‌య‌ అర్చ‌కులు శ్రీ బాలాజి రంగాచార్యులు ఆధ్వర్యంలో ఈ విశేష ఉత్సవం నిర్వహించారు. ఇందులో ముందుగా విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, రాజోపచారం నిర్వహించారు. అనంతరం ఛత్ర ఛామర వ్యజన దర్పణాది నైవేద్యం, ముఖ ప్రక్షాళన, ధూపదీప నైవేద్యం చేపట్టారు.

అర్ఘ్యపాద నివేదనలో భాగంగా పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు,పసుపు, గంధంతో స్నపనం నిర్వహించారు. శంఖధార, చక్రధార, సహస్రధార, మహాకుంభాభిషేకాలను వైఖానస ఆగమోక్తంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా తైత్తరీయ ఉపనిషత్తు, పురుషసూక్తం, శ్రీసూక్తం, భూసూక్తం, నీలాసూక్తం, పంచశాంతి మంత్రములు, దివ్యప్రభందములోని అభిషేక సమయంలో అనుసంధానము చేసే పాశురాలను అర్చకులు పఠించారు. ఈ వేడుకలో ఒకో క్రతువులో ఒక మాల వంతున ఏడు రకాల మాలలను స్వామి, అమ్మవార్లకు అలంకరించారు. ఇందులో వివిధ రకాల పూలు స్వామి, అమ్మవార్లకు అలంకరించారు.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమ‌తి శాంతి, ఏఈవో శ్రీ గురుమూర్తి, సూపరింటెండెంట్‌ శ్రీ చెంగ‌ల్రాయులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.