SRI PARTHASARADHI TAKES RIDE _ శ్రీ పార్థ‌సార‌ధిస్వామివారి అభ‌యం

Tirupati, 11 February 2022: The Teppotsavams in Sri Govinda Raja Swamy temple entered on second day on Friday.

As part of it, Sri Parthasaradhi Swamy was seated on Tiruchi instead of Teppa as the fete was observed in Ekantam due to Covid restrictions.

Spl Gr DyEO Sri Rajendrudu and others were present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

శ్రీ పార్థ‌సార‌ధిస్వామివారి అభ‌యం

తిరుప‌తి, 2022 ఫిబ్ర‌వ‌రి 11: తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామివారి తెప్పోత్సవాలలో భాగంగా రెండ‌వ‌ రోజైన శుక్ర‌వారం సాయంత్రం రుక్మీణి, స‌త్య‌భామ స‌మేత శ్రీ పార్థ‌సార‌ధిస్వామివారు ఆల‌య ప్రాంగ‌ణంలో తిరుచ్చిపై విహరించి అభ‌య‌మిచ్చారు. కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో పుష్కరిణిలో కాకుండా ఆలయంలో ఏకాంతంగా తెప్పోత్సవాలు నిర్వహిస్తున్నారు.

ఇందులో భాగంగా ఉద‌యం 10.30 నుండి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు రుక్మీణి, స‌త్య‌భామ స‌మేత శ్రీ పార్థ‌సార‌ధిస్వామివారి ఉత్స‌వ‌మూర్తుల‌కు వేడుక‌గా స్న‌ప‌న‌తిరుమంజ‌నం నిర్వ‌హించారు.  పాలు, పెరుగు, తేనె, కొబ్బ‌రి నీళ్ళు, చంద‌నం, ప‌సుపు త‌దిత‌ర సుగంధ ద్ర‌వ్యాల‌తో అభిషేకం చేశారు.

కాగా మూడో రోజైన ఫిబ్ర‌వ‌రి 12న‌ శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారిని వేంచేపు చేసి ఆలయంలో ఏకాంతంగా తెప్పోత్సవాలు నిర్వహిస్తారు.

ఈ కార్య‌క్రమంలో ఆల‌య ప్ర‌త్యేక‌శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీ‌రాజేంద్రుడు, ఏఈవో శ్రీ ర‌వికుమార్ రెడ్డి, ఆల‌య ప్ర‌ధాన అర్చ‌కులు శ్రీ ఎపి. శ్రీ‌నివాస దీక్షితులు, సూపప‌రింటెండెంట్లు శ్రీ నారాయ‌ణ‌, శ్రీ వెంక‌టాద్రి, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్‌ శ్రీ కామ‌రాజుపాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.