HEALTHY LIFE THROUGH A LIFESTYLE IN HARMONY WITH NATURE _ ప్రకృతి నియమాలకు అనుగుణమైన జీవనశైలితోనే సంపూర్ణ ఆరోగ్యం

– Dr. MANTHENA SATYANARAYANA RAJU, NATUROPATHY EXPERT

Tirupati, August 29, 2026: A lifestyle in harmony with nature and healthy food habits can help prevent many health problems caused by modern living, said renowned naturopathy expert and Andhra Pradesh Government Adviser Dr. Manthena Satyanarayana Raju.

A two-day awareness programme on “Health Protection through Yoga and Naturopathy”, jointly organised by the AYUSH Department, Government of Andhra Pradesh, and TTD, began at Mahati Kalakshetram in Tirupati on Saturday.

On the first day, Dr. Raju is creating awareness among TTD educational institution students, while on the second day, TTD employees and the public will be covered. He is explaining preventive healthcare, digital balance, food as medicine and digital detox, through PowerPoint presentations.

Have Dinner Before 6 PM

Speaking on “Arogya Sanjeevani”, Dr. Raju advised people to follow a lifestyle in tune with nature and regulate their daily routine according to sunrise and sunset. He particularly suggested completing dinner before 6 PM for better health.

He advised avoiding late-night meals followed by immediate sleep and suggested natural foods such as dry fruits, seeds and fruits in the evening, as required.

Give Importance to Millets

Dr. Raju said intermittent fasting is being followed in many countries and stressed the importance of controlling the timing and quantity of food. Including millets in the daily diet can provide essential nutrients and support overall health, he said.

“Ekabhuktham, Langhanam – Paramoushadham”

Dr. Raju said ancient Indian sages followed principles of health through self-discipline, yoga, meditation and a regulated lifestyle. Explaining the concept “Ekabhuktham, Langhanam – Paramoushadham”, he advised people to understand their body’s needs and eat accordingly.

He also explained the important role of the immune system and white blood cells in fighting diseases.

Healthy Habits from Childhood

Dr. Raju called for creating awareness among children from an early age about healthy food and disciplined living.

Following timely routines, natural food, yoga and a lifestyle in harmony with nature can help build a healthier society, he said.

District Collector Sri Venkateshwar, Tirupati Municipal Commissioner Sri Jayakrishna, AYUSH Regional Deputy Director Dr. Nagamuni Naik, TTD Deputy EO Sri Govindarajan, teachers and students of TTD educational institutions and others participated in the programme.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER

ప్రకృతి నియమాలకు అనుగుణమైన జీవనశైలితోనే సంపూర్ణ ఆరోగ్యం

ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు డా. మంతెన సత్యనారాయణ రాజు

తిరుపతి, 2026 ఆగస్టు 29: ఆధునిక జీవనశైలిలో మారుతున్న ఆహారపు అలవాట్లు, సమయపాలన లోపం కారణంగా అనేక అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయని ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ సలహాదారు డా. మంతెన సత్యనారాయణ రాజు అన్నారు.

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఆయుష్‌ శాఖ, టీటీడీ సంయుక్త ఆధ్వర్యంలో “యోగ, ప్రకృతి వైద్యంతో ఆరోగ్య పరిరక్షణ” అంశంపై రెండు రోజుల అవగాహన కార్యక్రమం శనివారం తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో ఘనంగా ప్రారంభమైంది.

ఈ కార్యక్రమంలో తొలి రోజు టీటీడీ విద్యాసంస్థల విద్యార్థులకు, రెండో రోజు టీటీడీ ఉద్యోగులు, పురప్రజలకు ముందస్తు ఆరోగ్య సంరక్షణ, డిజిటల్‌ సమతుల్యత, ఆహారమే ఔషధం, డిజిటల్‌ డిటాక్స్‌ తదితర అంశాలపై డా. మంతెన సత్యనారాయణ రాజు పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా అవగాహన కల్పిస్తున్నారు.

సాయంత్రం ఆరు గంటలలోపే రాత్రి భోజనం

“ఆరోగ్య సంజీవిని” అంశంపై డా. మంతెన సత్యనారాయణ రాజు మాట్లాడుతూ, జీవన విధానం ప్రకృతి నియమాలకు అనుగుణంగా ఉండాలని సూచించారు. సూర్యోదయం, సూర్యాస్తమయాలను అనుసరించి దైనందిన కార్యక్రమాలను క్రమబద్ధీకరించుకోవాలని తెలిపారు. ముఖ్యంగా రాత్రి భోజనాన్ని సాయంత్రం ఆరు గంటలలోపే పూర్తి చేసుకోవడం ఆరోగ్యానికి మేలు చేస్తుందని చెప్పారు.

రాత్రి ఆలస్యంగా భోజనం చేసి వెంటనే నిద్రించడం వల్ల జీర్ణవ్యవస్థపై అదనపు భారం పడుతుందని తెలిపారు. సాయంత్రం వేళ అవసరాన్ని బట్టి డ్రైఫ్రూట్స్‌, విత్తనాలు, పండ్లు వంటి సహజ ఆహారాన్ని తీసుకోవచ్చని సూచించారు.

ఆహారంలో చిరుధాన్యాలకు ప్రాధాన్యం

ప్రపంచంలోని అనేక దేశాల్లో ఇంటర్మిటెంట్‌ ఫాస్టింగ్‌ విధానాన్ని పాటిస్తున్నారని తెలిపారు. ఆహారం తీసుకునే సమయం, పరిమాణంపై నియంత్రణ ఉండాలని సూచించారు. రోజువారీ ఆహారంలో చిరుధాన్యాలకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా శరీరానికి అవసరమైన పోషకాలు లభించి ఆరోగ్యానికి మేలు జరుగుతుందని వివరించారు.

ఏకభుక్తం, లంఖణంపరమౌషధం

దాదాపు రెండు వేల సంవత్సరాల క్రితమే మన ఋషులు ఇంద్రియ నిగ్రహం, యోగం, ధ్యానం, నియమబద్ధమైన జీవన విధానం ద్వారా ఆరోగ్య సూత్రాలను ఆచరించారని డా. మంతెన సత్యనారాయణ రాజు తెలిపారు.

ఏకభుక్తం, లంఖణంపరమౌషధంఅనే భావనను వివరిస్తూ, శరీర 

అవసరాలను అర్థం చేసుకుని ఆహారం తీసుకోవాలని సూచించారు. శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ, తెల్ల రక్తకణాలు వ్యాధులతో పోరాడటంలో కీలక పాత్ర పోషిస్తాయని వివరించారు.

చిన్ననాటి నుంచే ఆరోగ్యకరమైన అలవాట్లు

చిన్న వయస్సు నుంచే పిల్లలకు ఆరోగ్యకరమైన ఆహారం, క్రమబద్ధమైన జీవన విధానంపై అవగాహన కల్పించాలని సూచించారు.

సమయపాలన, సహజమైన ఆహారం, యోగం, ప్రకృతికి అనుగుణమైన జీవనశైలిని అలవరచుకోవడం ద్వారా ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించవచ్చని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ శ్రీ వెంకటేశ్వర్‌, తిరుపతి మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీ జయకృష్ణ, ఆయుష్‌ రీజినల్‌ డిప్యూటీ డైరెక్టర్‌ డా. నాగముని నాయక్‌, టీటీడీ డిప్యూటీ ఈవో శ్రీ గోవిందరాజన్‌, విద్యాసంస్థల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.