TTD EO INTERACTS WITH DEVOTEES _ భక్తులతో ముచ్చటించిన టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర

REVIEWS PILGRIM FACILITIES

Tirumala, 17 September 2026: TTD Executive Officer Sri Muddada Ravichandra interacted with devotees on Thursday morning during the Simha Vahana Seva.

The EO visited the devotees’ gallery and enquired about the facilities and arrangements being provided by TTD. 

He spoke with pilgrims from Tamil Nadu, Hyderabad, Nellore, Maharashtra and other regions and received their feedback on darshan arrangements, pilgrim facilities, and Vahana Seva viewing arrangements.

The devotees expressed immense satisfaction with TTD services.

Interacting with Srivari Sevaks who were deployed to offer services to devotees in galleries, the EO directed them to provide a better and more comfortable services to devotees. 

He emphasized that Sevaks should offer wholehearted and selfless service to every pilgrim with warmth and devotion to enhance the darshan experience of devotees.

He instructed Sevaks to keep devotees informed about various services and facilities of TTD and respond promptly to their needs.

The EO stated that TTD’s goal is to provide spiritual joy to every devotee visiting the Srivari Brahmotsavams through devotion, service and hospitality.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER

భక్తులతో ముచ్చటించిన టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర

భక్తులకు అందుతున్న సౌకర్యాలపై ఆరా 

తిరుమల, 2026 సెప్టెంబర్ 17: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజు గురువారం ఉదయం జరిగిన సింహ వాహనసేవను వీక్షించేందుకు వచ్చిన భక్తులతో టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర ముచ్చటించారు.

వాహనసేవను వీక్షిస్తున్న భక్తుల గ్యాలరీలోకి వెళ్లిన ఈవో, భక్తులకు టీటీడీ కల్పిస్తున్న సౌకర్యాలు, ఏర్పాట్లపై వారిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తమిళనాడు, హైదరాబాద్, నెల్లూరు, మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో ఈవో ఆత్మీయంగా మాట్లాడారు.

భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు, దర్శన ఏర్పాట్లు, వాహనసేవ వీక్షణకు చేసిన ఏర్పాట్లపై భక్తుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. టీటీడీ అందిస్తున్న సౌకర్యాలపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు.

అనంతరం శ్రీవారి సేవకులతో ఈవో మాట్లాడుతూ, భక్తులకు మరింత మెరుగైన, సౌకర్యవంతమైన సేవలు అందించాలని సూచించారు. బ్రహ్మోత్సవాలకు విచ్చేసే ప్రతి భక్తుడికి ఆత్మీయతతో సేవలందిస్తూ, శ్రీవారి దర్శన అనుభూతిని మరింత ఆనందదాయకంగా తీర్చిదిద్దాలని అన్నారు.

టీటీడీ అందిస్తున్న వివిధ సేవలు, సౌకర్యాలను ఎప్పటికప్పుడు భక్తులకు చేరవేస్తూ, వారి అవసరాలకు అనుగుణంగా స్పందించాలని సేవకులకు సూచించారు.

భక్తి, సేవ, ఆతిథ్యంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలకు విచ్చేసే ప్రతి భక్తుడికి ఆధ్యాత్మిక ఆనందాన్ని అందించడమే టీటీడీ లక్ష్యమని ఈవో తెలిపారు.

టీటీడీ ప్రధాన ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.