ABHISHEKAM HELD TO AMMAVARU _ శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారికి అభిషేకం

Tirupati, 22 Jun. 21: As part of ongoing Teppotsavams in Ekantam in Tiruchanoor temple, Abhishekam was held to Sri Padmavathi Ammavaru at Sri Krishna Mukha Mandapam on Tuesday.

Temple DyEO Smt Kasturi Bai and others were present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారికి అభిషేకం

తిరుపతి, 2021జూన్ 22: శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాలలో మూడ‌వ రోజైన మంగ‌ళ‌వారం అమ్మ‌వారికి అభిషేకం జ‌రిగింది. కోవిడ్‌-19 వ్యాప్తి నేపథ్యంలో ఆల‌యంలో ఏకాంతంగా ఈ ఉత్స‌వాల‌ను నిర్వ‌హిస్తున్నారు.

ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన, నిత్యార్చన, నిర్వహించారు. మధ్యాహ్నం 2.30 నుండి సాయంత్రం 4 గంటల వరకు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ఉత్స‌వ‌ర్ల‌కు అభిషేకం నిర్వహించారు. సాయంత్రం 5 నుండి 6 గంట‌ల వ‌ర‌కు అమ్మ‌వారికి ఊంజ‌ల‌సేవ నిర్వ‌హించ‌నున్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి క‌స్తూరి బాయి, ఏఈవో శ్రీ ప్ర‌భాక‌ర్ రెడ్డి, సూప‌రింటెండెంట్ శ్రీమ‌తి మ‌ల్లిశ్వ‌రి, ఆల‌య అర్చ‌కులు శ్రీ బాబుస్వామి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ రాజేష్ పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.