ASTOTTARA SATA KALASABHISHEKAM IN SRI KRT _ అక్టోబ‌రు 13న శ్రీకోదండరామాలయంలో అష్టోత్తర శతకలశాభిషేకం

Tirupati, 11 Oct. 19: In connection with Pournami on October 13,   Astottara Sata  Kalasabhishekam will be performed in Sri Kodanda Rama Swamy temple in Tirupati.

In the evening there will be Asthanam at Ramachandra Pushkarini to the utsava murthies

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

 

 

అక్టోబ‌రు 13న శ్రీకోదండరామాలయంలో అష్టోత్తర శతకలశాభిషేకం
 
తిరుపతి, 2019 అక్టోబ‌రు 11: తిరుపతిలోని శ్రీకోదండరామస్వామివారి ఆలయంలో అక్టోబ‌రు 13వ తేదీ పౌర్ణమి సందర్భంగా అష్టోత్తర శతకలశాభిషేకం వైభవంగా జరుగనుంది. ఆలయంలో ఉదయం 9.00 గంటలకు ఈ సేవ నిర్వహిస్తారు. భక్తులు ఒక్కొక్కరు రూ.50/- చెల్లించి ఈ సేవలో పాల్గొనవచ్చు.
 
అనంతరం సాయంత్రం 5.30 గంటలకు శ్రీ సీత లక్ష్మణ సమేత శ్రీకోదండరామస్వామివారి ఉత్సవమూర్తులను ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తారు. అక్కడినుంచి శ్రీరామచంద్ర పుష్కరిణికి తీసుకెళ్లి ఆస్థానం చేపడతారు. ఆ తరువాత పుష్కరిణి హారతి నిర్వహిస్తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.