AVATAROTSAVAMS CONCLUDES _ ముగిసిన అవతార మహోత్సవాలు

TIRUPATI, 22 JUNE 2022: The annual three-day Avatarotsavams of Sri Sundararaja Swamy concluded on Wednesday evening with Garuda Seva.

 

Temple DyEO Sri Lokanatham and others participated.

 

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

గరుడ వాహనంపై శ్రీ సుందరరాజస్వామివారి కటాక్షం

ముగిసిన అవతార మహోత్సవాలు

తిరుపతి, 2022 జూన్ 22: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ సుందర రాజస్వామివారి అవతార మహోత్సవాలు బుధ‌వారం ఘనంగా ముగిశాయి. చివరిరోజు రాత్రి స్వామివారు గరుడవాహనంపై భక్తులను కటాక్షించారు.

ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి సహస్రనామార్చన నిర్వహించారు. మధ్యాహ్నం 2 నుండి 3.30 గంటల వరకు శ్రీ కృష్ణ‌స్వామివారి ముఖమండపంలో శ్రీ సుందరరాజ స్వామివారికి అభిషేకం నిర్వహించారు. సాయంత్రం 5.30 నుండి 6.15 గంటల వరకు స్వామివారికి ఊంజల్‌ సేవ వైభవంగా జరిగింది.

అనంతరం ఆలయం బయట గల వాహనమండపంలో శ్రీసుందరరాజస్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి గరుడ వాహనంపై వేంచేపు చేశారు. రాత్రి 7 గంటల నుండి స్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ లోక‌నాథం, ఏఈవో శ్రీ ప్ర‌భాక‌ర్ రెడ్డి, పాంచ‌రాత్ర ఆగ‌మ స‌ల‌హాదారు శ్రీ శ్రీ‌నివాసాచార్యులు, ఆల‌య అర్చకులు శ్రీ బాబుస్వామి, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.