CHAIRMAN INVITES UNION MINISTER _ శ్రీవారి ఆలయ మహాసంప్రోక్షణకు రండి – కేంద్రమంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ కు టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి ఆహ్వానం

TIRUPATI, 13 MAY 2022: TTD Chairman Sri YV Subba Reddy on Friday invited the Honourable Union Minister Sri Dharmendra Pradhan for the Maha Samprokshanam of Sri Venkateswara Swamy temple at Bhuvaneshwar in Orissa from May 21-26.

 

He formally met the central minister at his camp office in New Delhi and explained about the series of rituals scheduled on each day.

 

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

శ్రీవారి ఆలయ మహాసంప్రోక్షణకు రండి

– కేంద్రమంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ కు టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి ఆహ్వానం

తిరుపతి 13 మే 2022: భువనేశ్వర్‌లో టీటీడీ నిర్మించిన శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవస్ధానం మహాసంప్రోక్షణ కార్యక్రమానికి హాజరు కావాలని టీటీడీ చైర్మన్‌ శ్రీ వైవి సుబ్బారెడ్డి కేంద్ర మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ ను ఆహ్వానించారు. శుక్రవారం ఉదయం ఢిల్లీలో చైర్మన్ కేంద్ర మంత్రిని ఆయన కార్యాలయంలో కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు.

మే 21 వ తేదీ నుంచి ఆలయ మహాసంప్రోక్షణకు సంబంధించిన పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయని, 26వ తేదీ విగ్రహ ప్రతిష్ఠ, మహా సంప్రోక్షణ, ఆవాహన ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాలు జరుగుతాయని కేంద్ర మంత్రి కి చైర్మన్ వివరించారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.