DAKSHINAMURTHY HOMAM HELD _ శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో శ్రీ ద‌క్షిణామూర్తిస్వామివారి హోమం

శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో శ్రీ ద‌క్షిణామూర్తిస్వామివారి హోమం

తిరుపతి, 2021 న‌వంబ‌రు 11: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో గురువారం శ్రీ ద‌క్షిణామూర్తిస్వామివారి హోమం జ‌రిగింది. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఆలయంలో నెల రోజుల పాటు ఏకాంతంగా హోమ మ‌హోత్స‌వాలు నిర్వహిస్తున్న విష‌యం విదిత‌మే.

ఇందులో భాగంగా యాగశాలలో ఉదయం శ్రీ ద‌క్షిణామూర్తిస్వామివారి హోమం, మ‌హాపూర్ణాహుతి, కలశ ఉద్వాసన, మహాశాంతి అభిషేకం, కలశాభిషేకం నిర్వహించారు.

హోమ మ‌హోత్స‌వాల్లో భాగంగా న‌వంబ‌రు 12వ తేదీ శుక్ర‌వారం న‌వ‌గ్ర‌హ హోమం జ‌రుగ‌నుంది.

ఈ కార్యక్రమంలో ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ సుబ్రమణ్యం, సూప‌రింటెండెంట్ శ్రీ భూప‌తి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ రెడ్డి శేఖ‌ర్‌, ఆలయ అర్చకులు, అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

TIRUPATI, 11 NOVEMBER 2021: As part of Homa Mahotsavams, Sri Dakshinamurthy Homam was observed in Sri Kapileswara Swamy temple on Thursday.

On Friday, Navagraha Homam will be performed.

Temple DyEO Sri Subramanyam, AEO Sri Satre Naik and others were also present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI