ELEVENTH PHASE SUNDARAKANDA AKHANDA PATHANAM ON MARCH 18 _ మార్చి 18న 11వ విడ‌త‌ సుందరకాండ అఖండ పారాయ‌ణం

Tirumala, 16 March 2021: The Eleventh phase of Sundarakanda Akhanda Pathanam is scheduled to take place on March 18 at Nada Neerajana Mandapam in Tirumala which will be telecasted live on SVBC for the sake of global devotees.

In the 11th phase, 156 Shlokas from 45 to 48 Chapters in Sundarakanda will be recited and nearly 200 Vedic scholars from Dharmagiri Vedapathashala, Vedic University, National Sanskrit Varsity, SV Higher Vedic Studies, Veda Parayanamdars will take part in this mass recitation of Sundarakanda.

This programme will take place between 7am and 9am.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

మార్చి 18న 11వ విడ‌త‌ సుందరకాండ అఖండ పారాయ‌ణం

తిరుమల, 2021 మార్చి 16: కరోనా వైరస్ నుంచి ప్రపంచానికి విముక్తి కల్పించాలని శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమ‌లలోని నాద‌నీరాజ‌నం వేదిక‌పై మార్చి 18వ తేదీ గురువారం 11వ విడ‌త‌ సుందరకాండ అఖండ పారాయణం జ‌రుగ‌నుంది.

ఇందులో భాగంగా ఉద‌యం 7 గంటల నుండి సుందరకాండలోని 45వ సర్గ నుంచి 48వ సర్గ వరకు ఉన్న 156 శ్లోకాలను పారాయణం చేస్తారు. తిరుమల ధ‌ర్మ‌గిరి వేద విజ్ఞాన పీఠం, తిరుప‌తిలోని ఎస్వీ వేద విశ్వవిద్యాలయం, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం, వేదపారాయణదారులతో పాటు సుమారు 200 మంది ఈ అఖండ పారాయ‌ణంలో పాల్గొంటారు. కాగా ఇప్పటివరకు టిటిడి పది విడ‌త‌ల్లో అఖండ పారాయణాన్ని విజయవంతంగా నిర్వహించింది.

శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్ ఈ కార్య‌క్ర‌మాన్నిఉద‌యం 7 నుండి 9 గంట‌ల వ‌ర‌కు ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేయ‌నుంది. ఎస్వీబీసీ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం ద్వారా శ్రీ‌వారి భ‌క్తులు త‌మ ఇళ్ల‌లోనే ఈ పారాయ‌ణంలో పాల్గొని స్వామివారి కృప‌కు పాత్రులు కావాల‌ని కోర‌డ‌మైన‌ది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.