EO INSPECTS TTD CALL CENTRE _ టిటిడి కాల్‌ సెంటర్‌ను త‌నిఖీ చేసిన ఈవో డా|| కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి

Tirupati, 16 Mar. 21: TTD Executive Officer Dr KS Jawahar Reddy has directed the officials concerned to deploy the latest technology at the TTD Call Centre to provide comprehensive information and latest updates to devotees.

The TTD EO who inspected the Call Centre at the TTD Administrative Building on Tuesday enquired about the recording of suggestions and complaints by devotees and also responses to them.

Sri Sesha Reddy, chief of the IT wing explained to TTD EO on the process of response and data provision by all other TTD wings to devotees queries and suggestions.

TTD CIO Sri LM Sandeep, IT manager Sri Nadhamuni, call centre staff and other officials were present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

టిటిడి కాల్‌ సెంటర్‌ను త‌నిఖీ చేసిన ఈవో డా|| కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి

తిరుపతి, 2021 మార్చి 16: టిటిడి కాల్‌ సెంటర్‌లో అత్యాధునిక సాంకెేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి భక్తులకు మరింత వేగవంతంగా, సమగ్ర సమాచారం అందించాలని ఈవో డా|| కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి కాల్‌ సెంటర్‌ సిబ్బందిని ఆదేశించారు. టిటిడి పరిపాలనా భవనంలో గల కాల్‌ సెంటర్ పనితీరును అధికారుల‌తో క‌లిసి ఈవో మంగ‌ళ‌వారం త‌నిఖీ చేశారు.

ఈ సందర్భంగా ఈవో నిత్యం భ‌క్తుల నుండి కాల్‌ సెంటర్‌కు వచ్చే పలు సూచనలు, ఫిర్యాదులను అక్కడి సిబ్బంది ఏ విధంగా రికార్డు చేస్తున్నారు, ఏ విధంగా స‌మాధానం ఇస్తున్నారో ప‌రిశీలించారు.

కాల్ సెంట‌ర్ ప‌నితీరును, భ‌క్తుల సౌకర్యార్థం టిటిడి చేపడుతున్న కార్యక్రమాల సమాచారం, భక్తుల నుండి సలహాలు, సూచనలు, ఫిర్యాదులు వచ్చినప్పుడు సంబంధిత విభాగాల‌ అధికారుల‌కు ఏవిధంగా తెలియ‌జేస్తున్నార‌నేది ఐటి విభాగాధిపతి శ్రీ శేషారెడ్డి వివ‌రించారు. అనంత‌రం ఈవో కాల్‌ సెంటర్ సిబ్బందికి ప‌లు సూచ‌న‌లు చేశారు.

ఈ కార్య‌క్ర‌మంలో చీఫ్‌ ఇన్ఫర్మేషన్‌ అధికారి శ్రీ సందీప్ రెడ్డి, ఐటి మేనేజ‌ర్ శ్రీ నాద‌ముని, కాల్‌ సెంటర్‌ సిబ్బంది, ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.