IInd Day of ANNUAL PAVITHROTSAVAM IN TIRUCHANUR _ శ్రీ పద్మావతి అమ్మవారికి వైభవంగా పవిత్ర సమర్పణ
శ్రీ పద్మావతి అమ్మవారికి వైభవంగా పవిత్ర సమర్పణ
తిరుపతి, 2012 సెప్టెంబరు 28: తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయ పవిత్రోత్సవాల్లో భాగంగా రెండో రోజు అమ్మవారికి వైభవంగా పవిత్ర సమర్పణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి.
ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన, అభిషేకం నిర్వహించారు. అనంతరం అమ్మవారి ఉత్సవర్లను ఆలయం నుండి యాగశాలకు వేంచేపు చేసి ప్రభోధికి, ఆరాధన, హోమాలు చేపట్టారు.
మధ్యాహ్నం 12 గంటల నుండి 1 గంట వరకు శ్రీ కృష్ణస్వామి ముఖ మండపంలో అమ్మవారికి శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ, నివేదన, తీర్థప్రసాద గోష్ఠి నిర్వహించారు. కాగా పవిత్రోత్సవాల కారణంగా ఆలయంలో కళ్యాణోత్సవం, ఊంజల్సేవ, తిరుప్పావడసేవ, లక్ష్మీపూజ, పుష్పాంజలి ఆర్జిత సేవలను రద్దు చేశారు.
ఈ కార్యక్రమంలో తితిదే తిరుపతి జెఈఓ శ్రీ పి.వెంకట్రామిరెడ్డి దంపతులు, స్థానిక ఆలయాల డెప్యూటీ ఈఓ శ్రీ గోపాలకృష్ణ, ఆలయ అర్చకులు, ఏఈఓ శ్రీ వేణుగోపాల్ ఇతర అధికార ప్రముఖులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.