JEO PRESENTS SILKS TO SRISAILAM MALLANNA _ శ్రీశైల మల్లన్నకు శ్రీవారి తరపున పట్టు వస్త్రాలు సమర్పించిన జేఈవో శ్రీ వీరబ్రహ్మం 

TIRUPATI, 14 FEBRUARY 2023: JEO Sri Veerabrahmam on Tuesday provided silk vastrams on behalf of Tirumala Sri Venkateswara Swamy to Srisailam Mallikarjuna Swamy.

The annual fete in Srisailam commenced on February 11 and will last up to February 21. It has been a tradition to present Pattu Vastrams from TTD every year on this auspicious occasion.

Earlier on his arrival he was received by Srisailam Chairman Sri Chakrapani Reddy, EO Sri Lavanna, and followed by traditional welcome by Archakas of the temple.

TTD Parupattedar Sri Uma Maheshwar Reddy was also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్రీశైల మల్లన్నకు శ్రీవారి తరపున పట్టు వస్త్రాలు సమర్పించిన జేఈవో శ్రీ వీరబ్రహ్మం

తిరుపతి, 2023 ఫిబ్ర‌వ‌రి 14: శ్రీశైలంలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి తరపున టీటీడీ జెఈవో
శ్రీ వీరబ్రహ్మం దంపతులు మంగళవారం సాయంత్రం పట్టువస్త్రాలు సమర్పించారు.

శ్రీశైలంలో జరిగే శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా టీటీడీ తరపున పట్టువస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఫిబ్ర‌వ‌రి 11న ప్రారంభ‌మైన బ్ర‌హ్మోత్స‌వాలు 21వ తేదీ వ‌ర‌కు జ‌రుగ‌నున్నాయి.

ఆలయం వద్దకు చేరుకున్న జేఈవో దంపతులకు శ్రీ‌శైలం ఆలయ చైర్మన్ శ్రీ రెడ్డివారి చక్రపాణి రెడ్డి, ఈవో శ్రీ ల‌వ‌న్న, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి ద‌ర్శ‌న ఏర్పాట్లు చేశారు. అనంత‌రం ఆలయ అధికారులు వీరికి తీర్థ, ప్రసాదాలు అందించారు.

ఈ కార్య‌క్ర‌మంలో తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌య ఫార్‌ప‌తేధార్ శ్రీ ఉమా మహేశ్వర్ రెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.