KODANDA RAMA DONS MOHINI AVATARA _ పల్లకీపై మోహినీ అవతారంలో శ్రీ కోదండరాముడు
Tirupati, 17 Mar. 21: Sri Rama donned the Avatara of Universal Damsel Mohini and blessed devotees on Pallaki Vahanam.
On the fifth day of the ongoing annual Brahmotsavams in Sri Kodanda Rama Swamy temple at Tirupati on Wednesday, the processional deity in His religious splendour cheered on the finely decked palanquin.
In view of Covid guidelines, the annual fete is taking place in Ekantam.
Spl GrDyEO Smt Parvati and other office staffs were present.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
పల్లకీపై మోహినీ అవతారంలో శ్రీ కోదండరాముడు
తిరుపతి, 2021 మార్చి 17: తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మూత్సవాల్లో భాగంగా ఐదో రోజు బుధవారం ఉదయం మోహినీ అవతారంలో శ్రీరామచంద్రుడు పల్లకీలో కనువిందు చేశారు. కోవిడ్ -19 నేపథ్యంలో ఈ కార్యక్రమం ఉదయం 8 నుండి 9 గంటల వరకు ఆలయంలో ఏకాంతంగా నిర్వహించారు
సురాసురులు అమృతం కోసం క్షీరసాగరాన్ని మథిస్తారు. చివరికి వారు కోరుకున్న అమృతం లభిస్తుంది. దానిని పంచుకోవడంలో ఏర్పడిన కలహాన్ని నివారించి, సురులకు అమృతాన్ని పంచడానికి శ్రీహరి మోహినీ రూపంతో సాక్షాత్కరిస్తారు. తనకు భక్తులు కానివారు ఆ మాయాధీసులు కాక తప్పదనీ, తనకు ప్రసన్నులైనవారు మాయను సులభంగా దాటగలరని, ఈ మోహినీ రూపంలో ప్రకటిస్తున్నారు.
అనంతరం ఉదయం 11 నుండి 12 గంటల వరకు స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహించనున్నారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరి నీళ్లతో సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరాములవారి ఉత్సవమూర్తులకు అభిషేకం చేస్తారు.
కాగా రాత్రి 7.30 నుండి 8.30 గంటల వరకు గరుడసేవ జరగనుంది.
ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్స్వామి, ఆలయ ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి పార్వతి, ఏఈవో శ్రీ దుర్గరాజు, సూపరింటెండెంట్ శ్రీ రమేష్, టెంపుల్ ఇన్స్పెక్టర్లు శ్రీ మునిరత్నం, శ్రీ జయకుమార్, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.