PAVITHROTSAVAM CONCLUDES IN SRI KRT_ ఘనంగా ముగిసిన శ్రీ కోదండరామస్వామివారి ఆలయ పవిత్రోత్సవాలు

Tirupati, 30 Jul. 19: The three-day-long Festival Of Pavitrotsavam concluded grandly at the TTD local temple of Sri Kodandarama Swamy temple with the Purnahuti on Tuesday.

After morning rituals the utsava idols were given snapana thirumanjanam in the afternoon.

Later in the evening Thiruveedi utsava, Sattu mora at Bhashyakarla temple and Purnahutin rituals were completed.

DyEO Smt VR Shanti, AEO Sri Thirumalaiah, Superintendent Sri Ramesh, Temple Inspector Sri Ramesh and others participated.


ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

ఘనంగా ముగిసిన శ్రీ కోదండరామస్వామివారి ఆలయ పవిత్రోత్సవాలు

జూలై 30, తిరుపతి, 2019: తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయ పవిత్రోత్సవాలు మంగళవారం రాత్రి పూర్ణాహుతితో ఘనంగా ముగియనున్నాయి. ముందుగా స్వామివారిని ఉదయం సుప్రభాతంతో మేల్కొలిపి తోమాల సేవ, సహస్రనామార్చన నిర్వహించారు. ఉదయం 9 నుంచి 11 గంటల వరకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు జరిగాయి. ఉదయం 11 నుండి 12 గంటల వరకు ఉత్సవమూర్తులకు స్నపనతిరుమంజనం వైభవంగా జరిగింది. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్లతో విశేషంగా అభిషేకం చేశారు.

సాయంత్రం 5.30 నుండి 6.30 గంటల వరకు తిరువీధి ఉత్సవం, భాష్యకార్ల గుడి వద్ద యిహల్‌ శాత్తుమొర నిర్వహించనున్నారు. రాత్రి 7 నుండి 8.30 గంటల వరకు ఆలయంలోని యాగశాలలో వైదిక కార్యక్రమాలు జరుగనున్నాయి. రాత్రి 8.30 నుండి 10 గంటల వరకు పూర్ణాహుతి, ఉత్సవమూర్తులను, ప్రధాన కుంభాన్ని విమాన ప్రదక్షిణంగా సన్నిధికి చేర్చడం, కుంభా ఆవాహన తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి విఆర్‌.శాంతి, ఏఈవో శ్రీఎస్‌.తిరుమలయ్య, సూపరింటెండెంట్‌ శ్రీ రమేష్‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీ రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.