NARASIMHA JAYANTI IN TIRUMALA ON MAY 25 _ మే 25న తిరుమల‌లో శ్రీ నృసింహ జయంతి

Tirumala, 23 May 2021: In the advent of Swati Nakshatram on May 25, Sri Narasimha Jayanti will be observed in Tirumala.

Every year in the auspicious Vaisakha month, on this holy day, a special abhishekam is performed to Sri Yoga Narasimha Swamy Mulamurty, a sub-shrine located inside Tirumala temple.

As part of Vaisakha Masa special Utsavams, Sri Narasimha Swamy Puja will be observed between 8:30am and 10am which will be live telecasted on SVBC.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

మే 25న తిరుమల‌లో శ్రీ నృసింహ జయంతి

తిరుమల, 2021 మే 23: తిరుమల‌ శ్రీవారి ఆల‌యంలో మే 25న మంగళవారం నృసింహ జయంతి జరుగనుంది. ప్రతి ఏటా వైశాఖ మాసం స్వాతి నక్షత్రంలో నృసింహ జయంతిని నిర్వహిస్తారు. శ్రీ యోగ నరసింహస్వామివారి మూల‌మూర్తికి ఈ సందర్భంగా ప్రత్యేక అభిషేకం చేస్తారు.

వసంత మండపంలో శ్రీ నరసింహస్వామి వారి పూజ

వైశాఖ మాస ఉత్సవాల్లో భాగంగా తిరుమల‌ వసంత మండపంలో ఉదయం 8.30 నుండి 10 గంటల‌ వరకు శ్రీనరసింహస్వామి వారి పూజ నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాన్ని శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్‌ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది.

ఆల‌య ప్రాశస్త్యం :

శ్రీవారి ఆల‌య మొదటి ప్రాకారంలో గర్భాల‌యానికి ఈశాన్యం వైపున గల‌ మండపంలో పడమరగా శ్రీ యోగ నరసింహస్వామివారి ఉప ఆల‌యం ఉంది. శ్రీ యోగ నరసింహస్వామివారి విగ్రహాన్ని శాస్త్రాల‌ ప్రకారం రూపొందించారు. ఇక్కడ స్వామివారు యోగముద్రలో ఉంటారు. స్వామివారికి నాలుగు చేతులుంటాయి. పైభాగంలో ఉన్న చేతుల్లో శంఖుచక్రాలు కనిపిస్తాయి. కింది రెండు చేతులు ధ్యాననిష్టను సూచిస్తాయి. క్రీ.శ 1330 నుంచి క్రీ.శ 1360 మధ్య కాలంలో నిర్మితమైన ఈ ఆల‌యంలో శ్రీ రామానుజాచార్యుల‌ వారు శ్రీ యోగ నరసింహస్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు.

తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.