SUNDARARAJA SWAMY AVATAROTSAVAMS ENTERS SECOND DAY _ శాస్త్రోక్తంగా శ్రీ సుందరరాజస్వామివారికి అభిషేకం

Tirupati, 30 Jun. 21: The annual three day Sundararaja Swamy Avatarotsavams entered the second day in Tiruchanoor temple on Wednesday.

The Utsava deities of Sri Swamy varu flanked by Sridevi and Bhudevi seated on a special platform in Sri Krishna Mukha Mandapam were offered Snapana Tirumanjanam.

In the evening, Unjal Seva was performed to the deities. Due to Covid restrictions, the entire event took place in Ekantam.

Temple officials were present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

శాస్త్రోక్తంగా శ్రీ సుందరరాజస్వామివారికి అభిషేకం

తిరుపతి, 2021 జూన్ 30: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ సుందర రాజస్వామివారి అవతార మహోత్సవాల్లో భాగంగా రెండో రోజు బుధవారం స్వామి, అమ్మ‌వార్ల‌కు అభిషేకం నిర్వ‌హించారు. కోవిడ్ – 19 వ్యాప్తి నేప‌థ్యంలో ఆల‌యంలో ఏకాంతంగా ఈ ఉత్స‌వాన్ని నిర్వ‌హించారు.

ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి సహస్రనామార్చన నిర్వహించారు. మధ్యాహ్నం 2.30 నుండి 4 గంట‌ల వ‌ర‌కు
శ్రీ కృష్ణస్వామి ముఖమండపంలో శ్రీ సుందరరాజస్వామివారి ఉత్స‌వ‌ర్ల‌కు తిరుమంజనం నిర్వహించారు. ఉత్సవర్లకు పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు, చందనంలతో అభిషేకం చేశారు. సాయంత్రం శ్రీ సుంద‌ర‌రాజ‌స్వామివారికి ఊంజల్‌ సేవ నిర్వ‌హించ‌నున్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో డెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి క‌స్తూరి బాయి, ఏఈవో శ్రీ ప్ర‌భాక‌ర్ రెడ్డి, సూప‌రింటెండెంట్ శ్రీమ‌తి మ‌ల్లిశ్వ‌రి, ఆల‌య అర్చ‌కులు శ్రీ బాబుస్వామి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ రాజేష్‌, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.