TTD EO RELEASES PUSHPA YAGAM POSTERS _ శ్రీ కల్యాణవేంకటేశ్వరస్వామి పుష్పయాగం పోస్టర్ల ఆవిష్కరణ
శ్రీ కల్యాణవేంకటేశ్వరస్వామి పుష్పయాగం పోస్టర్ల ఆవిష్కరణ
తిరుపతి, మార్చి 29, 2013: శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఏప్రిల్ ఐదో తేదీన జరుగనున్న వార్షిక పుష్పయాగం పోస్టర్లను తితిదే కార్యనిర్వహణాధికారి శ్రీ ఎల్వీ సుబ్రమణ్యం శుక్రవారం తన చాంబర్లో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైన పుష్పయాగంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని తరించాలని కోరారు. ఏప్రిల్ ఐదో తేదీన మధ్యాహ్నం 2.45 గంటల నుండి 5.00 గంటల వరకు పుష్పయాగం కన్నులపండువగా జరుగనుందని ఆయన తెలిపారు. రూ.516/- చెల్లించి గృహస్తులు పుష్పయాగంలో పాల్గొనవచ్చన్నారు.
ఈ కార్యక్రమంలో తితిదే తిరుపతి సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీ పి.వెంకట్రామిరెడ్డి, స్థానిక ఆలయాల ఉప కార్యనిర్వహణాధికారులు శ్రీ గోపాలకృష్ణ, శ్రీమతి రెడ్డెమ్మ, ఇతర అధికార ప్రముఖులు పాల్గొన్నారు.
తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.