UGADI ASTHANAM IN SRI TT ON APRIL 2 _ ఏప్రిల్ 2న తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రీ శుభ‌కృత్‌నామ సంవత్సర ఉగాది ఆస్థానం

TIRUMALA, 01 APRIL 2022: Sri Subhakrutnama Samvatsara Ugadi Asthanam will be observed in Tirumala temple on April 2.

 

The Asthanam will take place at Garudalwar Sannidhi in Bangaru Vakili inside sanctum sanctorum.

 

TTD has cancelled all arjita sevas in connection with Asthanam on Saturday.

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఏప్రిల్ 2న తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రీ శుభ‌కృత్‌నామ సంవత్సర ఉగాది ఆస్థానం

తిరుమల, 2022 ఏప్రిల్ 01: తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 2వ తేదీ శ‌నివారం శ్రీ శుభ‌కృత్‌నామ సంవత్సర ఉగాది ఆస్థానం ఘనంగా జ‌రుగ‌నుంది.

ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని ముందుగా ఉదయం 3.00 గంటలకు సుప్రభాతం, నిర్వహించి అనంతరం శుద్థి నిర్వహిస్తారు. ఉదయం 6.00 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి మరియు విష్వక్సేనుల వారికి విశేష సమర్పణ చేస్తారు. ఉదయం 7.00 నుండి 9.00 గంటల నడుమ విమాన ప్రాకారం, ధ్వజస్తంభం చుట్టూ ఊరేగింపుగా ఆలయంలోనికి ప్రవేశిస్తారు. ఆ తరువాత శ్రీవారి మూలవిరాట్టుకు మరియు ఉత్స‌వ‌మూర్తులకు నూతన వస్త్రాలను ధరింపచేస్తారు. అనంతరం పంచాగ శ్రవణం నిర్వహిస్తారు. ఉగాది ఆస్థానాన్ని బంగారు వాకిలి వ‌ద్ద‌ ఆగమ పండితులు, అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు.

ఉగాది పర్వదినాన్ని పురస్క‌రించుకొని శ్రీవారి ఆలయంలో నిర్వహించే ఆర్జితసేవలైన కళ్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవాన్ని టిటిడి రద్దు చేసింది.

తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.