టీటీడీ రెడ్డి ఉద్యోగుల సంక్షేమ సంఘం క్యాలెండర్ ఆవిష్కరించిన టీటీడీ చైర్మన్

టీటీడీ రెడ్డి ఉద్యోగుల సంక్షేమ సంఘం క్యాలెండర్ ఆవిష్కరించిన టీటీడీ చైర్మన్

తిరుమల 13 జనవరి 2022: టీటీడీ రెడ్డి ఉద్యోగుల సంక్షేమ సంఘం ముద్రించిన నూతన సంవత్సర క్యాలెండర్ ను గురువారం టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి ఆవిష్కరించారు.
తిరుమలలోని చైర్మన్ క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు శ్రీ రాధా కృష్ణారెడ్డి, శ్రీ ఉమామహేశ్వర రెడ్డి, శ్రీనారాయణ రెడ్డి, శ్రీ సదాశివ కుమార్, శ్రీగరుడారెడ్డి, శ్రీ విజయ కుమార్ పాల్గొన్నారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది