ఫిబ్రవరిలో శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలు
ఫిబ్రవరిలో శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలు
తిరుపతి, 2020 ఫిబ్రవరి 03: టిటిడికి అనుబంధంగా ఉన్న తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఫిబ్రవరి నెలలో పలు విశేష ఉత్సవాలు జరుగనున్నాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.
– ఫిబ్రవరి 2 నుండి 8వ తేదీ వరకు శ్రీ గోవిందరాజస్వామివారి తెప్పోత్సవాలు.
– ఫిబ్రవరి 10న ప్రణయ కలహ మహోత్సవం సందర్భంగా సాయంత్రం 4.00 గంటలకు శ్రీ గోవిందరాజస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను అనుగ్రహించనున్నారు.
– ఫిబ్రవరి 12న ఉత్తర నక్షత్రాన్ని పురస్కరించుకుని సాయంత్రం 4.30 నుండి 5.30 గంటల వరకు ఊంజలసేవ, అనంతరం సాయంత్రం 5.30 గంటలకు ఉభయనాంచారులతో కలిసి శ్రీగోవిందరాజస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు.
– ఫిబ్రవరి 14న అధ్యాయనోత్సవాలలో భాగంగా పెద్ద శాత్తుమొర సందర్భంగా సాయంత్రం 5.30 గంటలకు ఉభయనాంచారులతో కలిసి శ్రీగోవిందరాజస్వామివారు, శ్రీనమ్మళ్వార్ ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించనున్నారు.
– ఫిబ్రవరి 17న అధ్యాయనోత్సవాల ముగింపు సందర్భంగా ఉదయం 6.00 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారు, శ్రీ ఆండాళ్ అమ్మవారు, సేనాధిపతివారు, ఆళ్వార్లు కపిలతీర్థం వద్దగల ఆళ్వార్ తీర్థానికి ఊరేగింపుగా తీసుకెళ్లి శాత్మొర, ఆస్థానం నిర్వహిస్తారు. అనంతరం తిరిగి ఆలయానికి చేరుకుంటారు.
– ఫిబ్రవరి 18న శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా నిర్వహించనున్న గరుడసేవ సందర్భంగా ఉదయం 6.30 గంటలకు శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం నుంచి శ్రీ ఆండాళ్ అమ్మవారి మాలల ఊరేగింపు.
– ఫిబ్రవరి 21, 28వ తేదీల్లో శుక్రవారం నాడు సాయంత్రం 4.30 నుండి 5.30 గంటల వరకు ఊంజలసేవ, సాయంత్రం 5.30 గంటలకు ఆలయ మాడవీధుల్లో శ్రీ ఆండాళ్ అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు.
– ఫిబ్రవరి 22న శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని సాయంత్రం 4.30 నుండి 5.30 గంటల వరకు ఊంజలసేవ, అనంతరం సాయంత్రం 5.30 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడి
తిరుపతి, 2020 ఫిబ్రవరి 03: టిటిడికి అనుబంధంగా ఉన్న తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఫిబ్రవరి నెలలో పలు విశేష ఉత్సవాలు జరుగనున్నాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.
– ఫిబ్రవరి 2 నుండి 8వ తేదీ వరకు శ్రీ గోవిందరాజస్వామివారి తెప్పోత్సవాలు.
– ఫిబ్రవరి 10న ప్రణయ కలహ మహోత్సవం సందర్భంగా సాయంత్రం 4.00 గంటలకు శ్రీ గోవిందరాజస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను అనుగ్రహించనున్నారు.
– ఫిబ్రవరి 12న ఉత్తర నక్షత్రాన్ని పురస్కరించుకుని సాయంత్రం 4.30 నుండి 5.30 గంటల వరకు ఊంజలసేవ, అనంతరం సాయంత్రం 5.30 గంటలకు ఉభయనాంచారులతో కలిసి శ్రీగోవిందరాజస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు.
– ఫిబ్రవరి 14న అధ్యాయనోత్సవాలలో భాగంగా పెద్ద శాత్తుమొర సందర్భంగా సాయంత్రం 5.30 గంటలకు ఉభయనాంచారులతో కలిసి శ్రీగోవిందరాజస్వామివారు, శ్రీనమ్మళ్వార్ ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించనున్నారు.
– ఫిబ్రవరి 17న అధ్యాయనోత్సవాల ముగింపు సందర్భంగా ఉదయం 6.00 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారు, శ్రీ ఆండాళ్ అమ్మవారు, సేనాధిపతివారు, ఆళ్వార్లు కపిలతీర్థం వద్దగల ఆళ్వార్ తీర్థానికి ఊరేగింపుగా తీసుకెళ్లి శాత్మొర, ఆస్థానం నిర్వహిస్తారు. అనంతరం తిరిగి ఆలయానికి చేరుకుంటారు.
– ఫిబ్రవరి 18న శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా నిర్వహించనున్న గరుడసేవ సందర్భంగా ఉదయం 6.30 గంటలకు శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం నుంచి శ్రీ ఆండాళ్ అమ్మవారి మాలల ఊరేగింపు.
– ఫిబ్రవరి 21, 28వ తేదీల్లో శుక్రవారం నాడు సాయంత్రం 4.30 నుండి 5.30 గంటల వరకు ఊంజలసేవ, సాయంత్రం 5.30 గంటలకు ఆలయ మాడవీధుల్లో శ్రీ ఆండాళ్ అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు.
– ఫిబ్రవరి 22న శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని సాయంత్రం 4.30 నుండి 5.30 గంటల వరకు ఊంజలసేవ, అనంతరం సాయంత్రం 5.30 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడి