MUTYAPU PANDIRI VAHANAM OBSERVED _ ముత్య‌పుపందిరి వాహనంపై బ‌కాసుర‌వ‌ధ‌ అవతారంలో శ్రీకల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామి

Srinivasa Mangapuram, 16 Feb. 20: On the third day evening on Sunday, Mutyapu Pandiri Vahana seva was observed at Srinivasa Mangapuram as a part of the ongoing annual brahmotsavams of Sri Kalyana Venkateswara Swamy. 

Large number of devotees converged to witness the procession wherein Lord as Sri Krishna flanked by His two consorts appeared in the pose of Bakasuravadha (killing of a Demon who comes on the guise of a giant crane). 

The bhajan troupes and kolatm teams added colour to the vahanam.

DyEO Sri Elleppa, AEO Sri Dhananjayulu and other staff took part.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI  

ముత్య‌పుపందిరి వాహనంపై బ‌కాసుర‌వ‌ధ‌ అవతారంలో  శ్రీకల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామి
 
తిరుపతి,2020 ఫిబ్రవరి 16: శ్రీనివాసమంగాపురంలోని శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన ఆదివారం రాత్రి అనంత తేజోమూర్తి అయిన శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీనివాసుడు బ‌కాసురుని వ‌ధిస్తున్న శ్రీ కృష్ణావతారంలోముత్య‌పుపందిరి వాహనంపై భక్తులకు అభయమిచ్చారు. రాత్రి 8.00 గంటల నుండి 9.00 గంటల వరకు స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. వాహనం ముందు గజరాజులు ఠీవిగా నడుస్తుండగా, భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

ముత్యాల నిర్మలకాంతులు వ్యాపించడానికి, ఆ కాంతులు దర్శించి భక్తులు ముక్తులు కావడానికి రాత్రి వేళయే అనుకూలం. అందుకే కల్యాణ శ్రీనివాసునికి మూడో రోజు రాత్రి మొదటియామంలో ముత్యాల పందిరిలో కూర్చొని విహరించే కైంకర్యాన్ని పెద్దలు నిర్ణయించారు. ముత్యం స్వచ్ఛతకు సంకేతం. మనిషి ఆత్మ ఎన్నో జన్మల అనంతరం విశ్వలోకాల నుండి రాలి, దుర్లభమైన మానవజన్మను సంతరించుకుంటుంది. మాంసమయమైన ఈ శరీరాన్ని ఆధ్యాత్మిక సంపదతో శుద్ధి చేసుకుంటే బుద్ధి ముత్యంలాగా మారి, జనన, మరణ చక్రం నుండి విడుదలై మోక్షాన్ని పొందుతుంది. ఇలా స్వామివారికి మిక్కిలి ప్రీతిపాత్రమైన ముత్యాలహారాలు – రత్నాల వల్ల కలిగే వేడిమినీ, పుష్పాల వల్ల కలిగే సుగంధాన్ని  తమలో ఇముడ్చుకుని, స్వామివారి వక్షఃస్థలానికి, అక్కడి లక్ష్మీదేవికి సమశీతోష్ణస్థితిని చేకూరుస్తూ, తాపగుణాన్ని హరిస్తూ, ఉత్సాహాన్ని, ప్రశాంతతను చేకూరుస్తున్నాయి.
         

ఈ కార్యక్రమంలో టిటిడి ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ ఎల్ల‌ప్ప‌, ఏఈవో శ్రీ ధ‌నంజ‌యుడు, సూపరింటెండెంట్‌  శ్రీ చెంగ‌ల్రాయులు, ప్రధాన అర్చ‌కులు శ్రీ బాలాజీ రంగాచార్యులు, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ అనిల్ కుమార్‌, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు, విశేష సంఖ్య‌లో భ‌క్తులు పాల్గొన్నారు.

శ్రీ‌నివాస‌మంగాపురం శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి బ్రహ్మోత్సవాలలో భ‌క్తిభావం పంచుతున్న సాంస్కృతిక కార్యక్రమం     

శ్రీ‌నివాస‌మంగాపురం శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఆదివారం నిర్వహించిన ఆధ్యాత్మిక, ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు భ‌క్తిభావాన్ని పంచాయి. టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్న‌మాచార్య ప్రాజెక్టు, దాస‌సాహిత్య ప్రాజెక్టు, ఎస్వీ సంగీత‌, నృత్య క‌ళాశాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన‌ కార్య‌క్ర‌మాలు ఆక‌ట్టుకుంటున్నాయి.

శ్రీ‌నివాస‌మంగాపురం శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌య మండ‌పంలో శ్రీ ఎం.హ‌రిబాబు బృందం ఉదయం 6.00 నుండి 6.30 గంటల వరకు మంగళధ్వని, ఉదయం 6.30 నుండి 8.00 గంటల వరకు తిరుప‌తికి చెందిన డా.ఎస్‌.జ‌య‌శ్రీ‌ బృందం విష్ణుస‌హ‌స్ర‌నామ పారాయ‌ణం నిర్వహించారు. ఉదయం 10.00 నుండి 11.00 గంటల వరకు చెన్నైకు చెందిన శ్రీ పి.శ్రీ‌నివాస‌వ‌ర్ధ‌న్‌ ధార్మికోప‌న్యాసం చేశారు.
       
మ‌ధ్యాహ్నం 3.00 నుండి 4.00 గంటల వరకు తిరుప‌తికి  చెందిన జి.అన‌సూయ‌ బృందం హ‌రిక‌థ పారాయ‌ణం,  సాయంత్రం 4.00 నుండి  5.00 గంట‌ల వ‌ర‌కు తిరుప‌తికి చెందిన శ్రీ జి.ఉద‌య్ భాస్క‌ర్ రెడ్డి బృందంచే అన్న‌మ‌య్య విన్న‌పాలు,  సాయంత్రం 5.00 నుండి 6.00 గంటల వరకు తిరుప‌తికి చెందిన వై.వేణుగోపాల్‌ బృందం  భ‌క్తి సంగీతం వినిపించారు. సాయంత్రం 6.00 నుండి 7.00 గంట‌ల వ‌ర‌కు తిరుప‌తికి చెందిన జి.మ‌ధుసూద‌న్‌రావు ఊంజల్‌ సేవలో అన్న‌మ‌య్య సంకీర్తన‌ల‌ను ఆల‌పించారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.