TTD CHAIRMAN RECALLS SESHADRI SERVICES _ శేషాద్రి స్వామి మరణం టీటీడీ కి తీరని లోటు : టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి సంతాపం

TIRUMALA, 29 NOVEMBER 2021: Extending his heartfelt condolences over the sudden demise of Tirumala temple OSD Sri P Seshadri, TTD Chairman Sri YV Subba Reddy said that he has left an indelible mark in the hearts of everyone with his extraordinary services to Sri Venkateswara Swamy for over forty years.

 

The Chairman also his condolences to the bereaved family of Sri Seshadri.

 

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

శేషాద్రి స్వామి మరణం టీటీడీ కి తీరని లోటు : టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి సంతాపం

తిరుమల 29 నవంబరు 2021: నాలుగున్నర దశాబ్దాలుగా తిరుమల శ్రీవారి సేవలో తరిస్తున్న శ్రీ పాల శేషాద్రి (డాలర్ శేషాద్రి) స్వామి మరణం టీటీడీ కి తీరని లోటని టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి సోమవారం ఒక ప్రకటనలో సంతాపం ప్రకటించారు.

వైజాగ్ లో టీటీడీ సోమవారం నిర్వహించనున్న కార్తీక దీపోత్సవం కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్ళిన శేషాద్రి స్వామి తన చివరి శ్వాస స్వామివారి సేవలోనే విడిచారని శ్రీ సుబ్బారెడ్డి కొనియాడారు.

శ్రీవారి సేవే ఊపిరిగా ఆయన పని చేశారని, జీవితమంతా స్వామివారి సేవలో తరించిన ధన్య జీవి శేషాద్రి స్వామి అని చెప్పారు. అందరితో ప్రేమగా, ఆలయ సేవలు, ఉత్సవాలు, కైంకర్యాలు, టీటీడీ నిర్వహించే ఇతర వైదిక కార్యక్రమాల్లో అధికారులు, జియ్యంగార్లు, అర్చకులకు ఆయన పెద్ద దిక్కుగా పని చేశారన్నారు.

ఆయన మరణ వార్త తనను తీవ్ర ఆవేదనకు గురి చేసిందని ఛైర్మన్ తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులకు ఈ బాధను తట్టుకోగలిగే మానసిక ధైర్యం ప్రసాదించాలని శ్రీవారిని ప్రార్థిస్తున్నట్లు ఆయన తెలిపారు

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది