GARUDA PANCHAMI OBSERVED _ తిరుమలలో ఘనంగా గరుడ పంచమి
తిరుమలలో ఘనంగా గరుడ పంచమి
తిరుమల, 2026 ఆగస్టు 17: గరుడపంచమి పర్వదినాన్ని పురస్కరించుకొని సోమవారం తిరుమలలో శ్రీమలయప్పస్వామివారు తమ ఇష్టవాహనమైన గరుడునిపై తిరుమాడ వీధులలో విహరించి భక్తులను కటాక్షించారు. రాత్రి 7 గంటలకు గరుడ వాహనసేవ ప్రారంభమైంది.
శ్రీవారి వాహనాల్లోను, సేవకుల్లోను అగ్రగణ్యుడు గరుడుడు. ప్రతి ఏడాదీ గరుడ పంచమిని శుక్ల పక్షం ఐదవ రోజు ఘనంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ”గరుడ పంచమి” పూజను నూతన దంపతులు తమ వైవాహిక జీవితం ఆనందదాయకంగా వుండేందుకు, స్త్రీలు తమకు పుట్టే సంతానం గరుడునిలాగా, బలశాలిగా ఉండేందుకు చేస్తారు.
గరుడ వాహనసేవలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చినజీయర్ స్వామి, అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.
Tirumala, 17 August 2026: On the auspicious occasion of Garuda Panchami, Sri Malayappa Swamy, took a celestial procession on His favourite Garuda Vahana, along the four Mada Streets of Tirumala on Monday evening and blessed the devotees. The Garuda Vahana Seva commenced at 7 PM.
Both the senior and junior pontiffs of Tirumala, TTD Additional EO Sri Ch. Venkaiah Chowdary and other officials participated in the Garuda Vahana Seva.
ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI







