ANNUAL VASANTHOTASAVAMS CONCLUDES _ శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ముగిసిన వసంతోత్సవాలు 

TIRUPATI, 12 MAY 2023: The annual Vasanthotsavams in Sri Kalyana Venkateswara Swamy temple at Srinivasa Mangapuram near Tirupati concluded on a grand religious note on Friday.

The Snapana Tirumanjanam was observed between 2pm and 4pm. Special Grade DyEO Smt Varalakshmi and other temple staff, devotees were present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI  

శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ముగిసిన వసంతోత్సవాలు

తిరుపతి, 2023 మే 12: శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మూడు రోజుల పాటు జరిగిన వసంతోత్సవాలు శుక్రవారం ముగిశాయి.

చివరి రోజు మధ్యాహ్నం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి, శ్రీ సీతాలక్ష్మణ ఆంజ‌నేయ‌ సమేత శ్రీరామచంద్రమూర్తి, శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీకృష్ణస్వామివారి ఉత్సవమూర్తులను వేంచేపుగా తీసుకొచ్చి శాస్త్రోక్తంగా స్న‌ప‌న తిరుమంజ‌నం నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, చందనం తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు. సాయంత్రం ఊంజల్ సేవ, వీధి ఉత్సవం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఆల‌య ప్ర‌త్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమ‌తి వ‌ర‌ల‌క్ష్మి, ఏఈవో శ్రీ గురుమూర్తి, సూప‌రింటెండెంట్లు శ్రీ చెంగ‌ల్రాయులు, శ్రీ వెంకటస్వామి, టెంపుల్ ఇన్స్పెక్టర్లు శ్రీ కిరణ్ కుమార్ రెడ్డి, శ్రీ ధన శేఖర్,  ఆల‌య అర్చ‌కులు శ్రీ బాలాజి రంగాచార్యులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.