ANNUAL VASANTHOTSAVAMS IN SRI PAT _ మే 15 నుండి 17వ తేదీ వరకు శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలు

TIRUPATI, 30 APRIL 2022: Annual Vasanthotsavams will be observed in Sri Padmavathi Ammavaru temple at Tiruchanoor from May 15-17 with Ankurarpana on May 14.

Every day there will be Snapana Tirumanjanam between 2:30pm and 4:30pm to Utsava Murthies.

TTD has cancelled Arjita Sevas including Kalyanotsavam, Sahasra Deepalankara Seva on these three days and Astadala Pada Padmaradhana on May 16.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI 

మే 15 నుండి 17వ తేదీ వరకు శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలు

తిరుపతి, 2022 ఏప్రిల్ 30: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మే 15 నుండి 17వ తేదీ వరకు వార్షిక వసంతోత్సవాలు జ‌రుగ‌నున్నాయి. ఇందుకోసం మే 14వ తేదీ సాయంత్రం 6 గంట‌ల‌కు అంకురార్పణ నిర్వ‌హిస్తారు.

ఈ ఉత్స‌వాల్లో భాగంగా మే 15 నుండి 17వ తేదీ వ‌ర‌కు మూడు రోజుల పాటు మ‌ధ్యాహ్నం 2.30 నుండి 4.30 గంటల వరకు ఆల‌యంలో అమ్మవారి ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం చేప‌డ‌తారు. అలాగే రాత్రి 7 నుండి 8.30 గంటల వరకు అమ్మ‌వారు ఆల‌య నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భ‌క్తుల‌కు ద‌ర్శ‌నం ఇవ్వ‌నున్నారు.

ఈ ఉత్స‌వాల కార‌ణంగా మే 15 నుండి 17వ తేదీ వ‌రకు క‌ల్యాణోత్స‌వం, సహ‌స్ర‌దీపాలంకార‌సేవ‌, మే 16న అష్ట‌ద‌ళ‌పాద‌ప‌ద్మారాధ‌న ఆర్జిత‌సేవ‌ల‌ను టిటిడి ర‌ద్దు చేసింది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.