COVID AWARENESS ON OCT 15 _ అక్టోబ‌రు 15న శ్వేత‌లో క‌రోనాపై అవ‌గాహ‌న‌ కార్య‌క్ర‌మం

Tirupati, 13 Oct. 20: An awareness programme on Covid 19 will be organised under the aegis of TTD in SVETA building on October 15.

Renowned Diabetes Expert Dr Penna Krishna Prasanthi will take part in this interactive session arranged for TTD employees by SVETA Director Sri Ramanjulu Reddy between 11am and 1pm on Thursday.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

అక్టోబ‌రు 15న శ్వేత‌లో క‌రోనాపై అవ‌గాహ‌న‌ కార్య‌క్ర‌మం

తిరుప‌తి, 2020 అక్టోబ‌రు 13: తిరుప‌తిలోని శ్వేత భ‌వ‌నంలో గ‌ల‌ స‌మావేశ మందిరంలో ఈ నెల 15వ తేదీ గురు‌వారం ఉద‌యం 11 ‌నుండి ‌మ‌ధ్యాహ్నం 1 గంట వ‌ర‌కు క‌రోనాపై టిటిడి ఉద్యోగుల‌కు ఆన్‌లైన్ ద్వారా అవ‌గాహ‌న కార్య‌క్ర‌మం జ‌రుగుతుంద‌ని శ్వేత సంచాల‌కులు డా.కె.రామాంజుల‌రెడ్డి ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు.

తిరుప‌తికి చెందిన ప్ర‌ముఖ వైద్యురాలు డాక్ట‌ర్ కృష్ణ‌ప్ర‌శాంతి ఈ కార్య‌క్ర‌మానికి విచ్చేసి షుగ‌రు వ్యాధిపై క‌రోనా ప్ర‌భావం – అవ‌గాహ‌న అనే అంశంపై స‌ల‌హాలు, సూచ‌న‌లు ఇస్తార‌ని తెలిపారు. ఉద్యోగులు ఈ అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని ఆయ‌న కోరారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.