CULTURAL SPLENDOR AT SRIVARI BRAHMOTSAVAMS IN TIRUPATI _ తిరుపతిలో వెల్లివిరిసిన బ్రహ్మోత్సవాల సాంస్కృతిక శోభ
Tirupati, September 18, 2026; On Friday, during the Srivari Brahmotsavams, devotional, spiritual and cultural programs organized by TTD in Tirupati captivated devotees.
They were arranged by the TTD Hindu Dharma Prachara Parishad, Dasa Sahitya Project, Annamacharya Project and Sri Venkateswara College of Music and Dance.
Mahati Auditorium, Tirupati (6.30 pm to 8.30 pm): An instrumental ensemble by Sri M.P. Ramesh and troupe from Tirupati, and a Bharatanatyam performance by Smt. P. Malavika and troupe from Hyderabad, greatly impressed the devotees.
Annamacharya Kalamandiram (6.30 pm to 8.30 pm): Dr. Thatha Girija Seshamamba and troupe from Tirupati presented a devotional music concert.
Ramachandra Pushkarini (6 pm to 8 pm): A vocal concert by Smt. B. Chinnamadevi and troupe, and a Bharatanatyam performance by Sri C. Harika and troupe, both from Tirupati, greatly impressed the devotees.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER
తిరుపతిలో వెల్లివిరిసిన బ్రహ్మోత్సవాల సాంస్కృతిక శోభ
భక్తి సంగీతం.. వాయిద్య సమ్మేళనం.. భరతనాట్య నృత్యవిన్యాసాలతో ఆధ్యాత్మిక సందడి
తిరుపతి, 2026 సెప్టెంబర్ 18 ; శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుపతిలో శుక్రవారం టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహించిన ధార్మిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్, దాససాహిత్య ప్రాజెక్టు, అన్నమాచార్య ప్రాజెక్టు, శ్రీ వేంకటేశ్వర సంగీత, నృత్య కళాశాల సంయుక్తంగా ఈ కార్యక్రమాలను నిర్వహించాయి.
మహతి ఆడిటోరియంలో సంగీత–నృత్య వైభవం
మహతి ఆడిటోరియంలో సాయంత్రం 6.30 నుంచి రాత్రి 8.30 గంటల వరకు తిరుపతికి చెందిన శ్రీ ఎం.పి. రమేష్ బృందం వాయిద్య సమ్మేళనం, హైదరాబాద్కు చెందిన శ్రీమతి పి. మాళవిక బృందం భరతనాట్య ప్రదర్శన భక్తులను అలరించాయి.
అన్నమాచార్య కళామందిరంలో భక్తి సంగీతం
అన్నమాచార్య కళామందిరంలో సాయంత్రం 6.30 నుంచి రాత్రి 8.30 గంటల వరకు తిరుపతికి చెందిన డాక్టర్ తాతా గిరిజా శేషమాంబ బృందం నిర్వహించిన భక్తి సంగీత కచేరి ఆధ్యాత్మిక పరవశాన్ని కలిగించింది.
రామచంద్ర పుష్కరిణిలో గాన–నృత్య ప్రదర్శనలు
రామచంద్ర పుష్కరిణిలో సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు తిరుపతికి చెందిన శ్రీమతి బి. చిన్నమదేవి బృందం గాత్ర కచేరి, శ్రీ సి. హారిక బృందం భరతనాట్య ప్రదర్శన భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుపతిలోని పలు వేదికలపై సాగిన ఈ భక్తి, సంగీత, నృత్య కార్యక్రమాలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.





