EO performs Ganga Pooja in Tirumala Dams on the occasion of World Water Day _ తిరుమలలో అంతర్జాతీయ జలదినోత్సవ సందర్భంగా వేడుకగా గంగపూజ
తిరుమలలో అంతర్జాతీయ జలదినోత్సవ సందర్భంగా వేడుకగా గంగపూజ
తిరుమల, 22 మార్చి – 2013 : తిరుమలలోని పాపవినాశనం, గోగర్భతీర్థం జలాశయాల్లో తి.తి.దే ఇంజనీరింగ్ విభాగం నీటిపారుదలశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం మార్చి 22వ తేదిన అంతర్జాతీయ జలదినోత్సవాన్ని పురస్కరించుకుని జరిగిన గంగ పూజ వేడుకలలో తి.తి.దే ఇ.ఓ శ్రీ ఎల్.వి.సుబ్రహ్మణ్యం దంపతులు, జె.ఇ.ఓ శ్రీ కె.ఎస్. శ్రీనివాసరాజు పాల్గొన్నారు.
గంగపూజ అనంతరం తితిదే ఇ.ఓ విలేకరులతో మాట్లాడుతూ గంగమ్మతల్లి కృపాకటాక్షాల వలన తిరుమల జలాశయాలన్నీ నీటి సంపదతో కళకళలాడుతున్నాయన్నారు. గత 20 ఏళ్ళుగా తి.తి.దే గంగామాతకు కృతజ్ఞతా పూర్వకంగా ఈ గంగపూజను నిర్వహిస్తున్నదన్నారు. అంతేకాకుండ మార్చి 22వ తేదీన అంతర్జాతీ జలదినోత్సవం కూడా కావడం విశేషం అన్నారు. 1992వ సంవత్సరములో ఐక్యరాజ్య సమితి ప్రతిపాదనల మేరకు ప్రపంచ వ్యాప్తంగా ఈ దినమున జలదినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నారన్నారు. ప్రాణకోటిని ప్రాణాలతో నిలిపేది జలశక్తి అన్నారు. కనుక జలదేవతను అనునిత్యం ఆరాధిస్తూ మానవాళి సంక్షేమానికి గంగపూజను తితిదే క్రమం తప్పకుండా నిర్వహిస్తుండడం విశేషం అన్నారు. కాగా ప్రస్తుతం తిరుమలలో 373 రోజులకు సరిపడ జలవనరులు 5 జలాశయాలలోను సంవృద్ధిగా ఉన్నాయన్నారు.
ఎంతో వేడుకగా జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యనిఘా మరియు భద్రతాధికారి శ్రీ అశోక్ కుమార్, అదనపు ముఖ్య నిఘా మరియు భద్రతాధికారి శ్రీ శివకుమార్రెడ్డి, నీటిపారుదల శాఖ ఇఇ శ్రీ నరసింహమూర్తి, ఇఇ-1 శ్రీ కృష్ణారెడ్డి, డిప్యూటి ఇఓ కళ్యాణకట్ట శ్రీ కృష్ణారెడ్డి, తదితర సిబ్బంది, భజన బృందాలు భక్తులు పాల్గొన్నారు.
తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.