FIVE MORE TAKE OATH AS TTD BOARD MEMBERS _ ఐదుగురు టిటిడి ధర్మకర్తల మండలి సభ్యులు ప్రమాణస్వీకారం

TIRUMALA, 18 SEPTEMBER 2021:  Five more took oath as Board members of TTD Trust Board on Saturday at Tirumala temple.

 

Among them, Smt Vemireddi Prasanthi Reddy, Sri Sanath Kumar, Sri Parthasaradhi Reddy, Sri Srinivasan and Sri Madhusudhan Yadav took oath at Bangaru Vakili. TTD Additional EO Sri AV Dharma Reddy administered oath with the members.

 

After darshan of Sri Venkateswara Swamy, the members were rendered Vedasirvachanam and presented with theertha prasadams of Srivaru.

 

Deputy EOs Sri Ramesh Babu, Smt Sudharani, VGO Sri Bali Reddy and others were also present.

 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

ఐదుగురు టిటిడి ధర్మకర్తల మండలి సభ్యులు ప్రమాణస్వీకారం

తిరుమల, 2021 సెప్టెంబ‌రు 18: టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి సభ్యులుగా శ్రీ‌మ‌తి వేమిరెడ్డి ప్ర‌శాంతిరెడ్డి, శ్రీ పి.స‌న‌త్‌కుమార్‌, శ్రీ ఎన్‌.శ్రీ‌నివాస‌న్‌, శ్రీ బండి పార్థ‌సార‌థిరెడ్డి, శ్రీ బుర్ర మ‌ధుసూద‌న్ యాద‌వ్ శ‌నివారం తిరుమల శ్రీ‌వారి ఆలయంలో ప్రమాణ స్వీకారం చేశారు.

ఆల‌యంలోని బంగారు వాకిలి వ‌ద్ద టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో ఐదుగురు బోర్డు స‌భ్యుల‌కు వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. శ్రీవారి తీర్థప్రసాదాలు, చిత్రపటం, కాఫీ టేబుల్ బుక్‌ను అద‌న‌పు ఈఓ అందించారు.

అనంతరం ఆలయం వెలుపల శ్రీ‌మ‌తి వేమిరెడ్డి ప్ర‌శాంతిరెడ్డి, శ్రీ బండి పార్థ‌సార‌థిరెడ్డి, శ్రీ మ‌ధుసూద‌న్ యాద‌వ్‌ మీడియాతో మాట్లాడుతూ త‌మ‌కు ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్.జగన్మోహన్ రెడ్డికి కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశారు. ఈ అవ‌కాశాన్ని జ‌న్మ‌జ‌న్మ‌ల అదృష్టంగా భావిస్తున్నామ‌ని చెప్పారు. త్వ‌ర‌లోనే ప్ర‌జ‌లంద‌రూ క‌రోనా నుండి పూర్తిగా బ‌య‌ట‌ప‌డాల‌ని స్వామివారిని ప్రార్థించిన‌ట్టు తెలిపారు.
       
ఈ కార్య‌క్ర‌మంలో పార్ల‌మెంటు స‌భ్యులు శ్రీ వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్‌రెడ్డి, ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ రమేష్ బాబు, డెప్యూటీ ఈవో (జనరల్) శ్రీమతి సుధారాణి, పేష్కార్ శ్రీ శ్రీ‌హ‌రి ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.  

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.