KOIL ALWAR TIRUMANJANAM PERFORMED _ శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం

Tirupati, 8 Jul. 21: The traditional Temple cleansing fete Koil Alwar Tirumanjanam was performed with religious ecstasy in Srinivasa Mangapuram on Thursday.

This was performed in connection with Sakshatkara Vaibhavotsavams which are set to commence from July 13-15.

The entire premises of the temple was cleaned with Parimalam, an aromatic mixture which was smeared all over the walls, roofs of the temple.

Temple DyEO Smt Shanti and others were present in this fete which was observed in Ekantam in view of Covid restrictions.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం

తిరుపతి, 2021 జులై 08: శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో గురువారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జ‌రిగింది. కోవిడ్‌-19 వ్యాప్తి నేప‌థ్యంలో ఆల‌యంలో ఏకాంతంగా ఈ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. శ్రీవారి సాలకట్ల సాక్షాత్కార వైభవోత్సవం జులై 13 నుండి 15వ తేదీ వరకు జరుగనుంది. ఈ ఉత్స‌వానికి ముందు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ.

ఈ సందర్భంగా తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, కొలువు నిర్వహించారు. ఉదయం 6.30 నుండి 11.30 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం చేప‌ట్టారు. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయమంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం భక్తులను మధ్యాహ్నం 11.45 గంటల నుండి సర్వదర్శనానికి అనుమతించారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి శాంతి, సూప‌రింటెండెంట్ శ్రీ ర‌మ‌ణ‌య్య‌, అర్చ‌కులు శ్రీ నారాయ‌ణాచార్యులు, శ్రీ పార్థ‌సార‌ధి, ఆర్జితం ఇన్‌స్పెక్ట‌ర్ శ్రీ యోగానంద‌రెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.