MALAYAPPA RIDES GAJA VAHANA _ గజ వాహనంపై శ్రీ మలయప్ప కనువిందు
Tirumala,23 September 2023: On the evening of the sixth day of the ongoing Srivari annual Brahmotsavams in Tirumala Sri Malayappa Swamy rides on the majestic Gaja Vahana along the Mada streets.
Malayappa enthralled the devotees by riding on the huge golden elephant carrier which is a symbol of richness and royalty.
TTD EO Sri AV Dharma Reddy and others were present.
ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
గజ వాహనంపై శ్రీ మలయప్ప కనువిందు
తిరుపతి, 2023 సెప్టెంబరు 23: శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 6వ రోజు శనివారం రాత్రి 7 గంటలకు శ్రీ మలయప్పస్వామివారు గజవాహనంపై దర్శనమిచ్చారు. మాడ వీధుల్లో అంగరంగ వైభవంగా జరిగిన వాహనసేవలో వివిధ కళాబృందాల ప్రదర్శనలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని వాహనసేవలో దర్శించుకున్నారు.
గజ వాహనం – కర్మ విముక్తి
నిద్ర లేవగానే ఐశ్వర్యానికి ప్రతీక అయిన ఏనుగును దర్శించడం వల్ల భోగభాగ్యాలు అభివృద్ధి అవుతాయి. మంగళకరమైన గజరాజుకు అతిశయమైన మంగళత్వం కలిగించేందుకు శ్రీవారు ఆరో రోజు తన సార్వభౌమత్వాన్ని భక్తులకు తెలిపేందుకు గజవాహనంపై ఊరేగుతాడు. ఏనుగు ఓంకారానికీ, విశ్వానికీ సంకేతం. స్వామి ప్రణవరూపుడు, విశ్వాకారుడూ, విశ్వాధారుడూ కనుక గజరాజుపై ఊరేగడం ఎంతో సముచితం. ఈ ఉత్సవం మనలోని అహంకారం తొలగితే మనపై రక్షకుడుగా భగవంతుడుంటాడనే సంగతి గుర్తు చేస్తుంది.
వాహనసేవలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్స్వామి, తిరుమల శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్స్వామి, ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి దంపతులు, జిల్లా కలెక్టర్ శ్రీ వెంకట రమణ రెడ్డి, బోర్డు సభ్యులు శ్రీ అశ్వర్థ నాయక్, ఢిల్లీ స్థానిక సలహా మండలి అధ్యక్షురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, జెఈవోలు శ్రీ మతి సదా భార్గవి, శ్రీ వీరబ్రహ్మం, సివిఎస్వో శ్రీ నరసింహ కిషోర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.