SUBRAMANYA HOMAM CONCLUDED _ శ్రీకపిలేశ్వరస్వామివారిఆలయంలోముగిసిన శ్రీ సుబ్రమణ్యస్వామివారి హోమం

Tirupati, 10 November 2021: As part of the month-long Homamahotsavams in Sri Kapileswara Swamy temple, Subramanya Homam concluded on Wednesday evening

Sri Dakshina Murthy Homam will be observed on November 11.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో ముగిసిన శ్రీ సుబ్రమణ్యస్వామివారి హోమం

తిరుపతి, 2021 న‌వంబ‌రు 10 ; తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో మూడు రోజుల పాటు జ‌రిగిన శ్రీ సుబ్రమణ్యస్వామివారి హోమం బుధ‌వారం ముగిసింది. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఆలయంలో నెల రోజుల పాటు ఏకాంతంగా హోమ మ‌హోత్స‌వాలు నిర్వహిస్తున్న విష‌యం విదిత‌మే.

ఇందులో భాగంగా యాగశాలలో ఉదయం పూజ, హోమం, మహాపూర్ణాహుతి, నివేదన, హారతి నిర్వహించారు. సాయంత్రం శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రమణ్య స్వామివారి కల్యాణం వేడుక‌గా జ‌రిగింది.

న‌వంబ‌రు 11న గురువారం ద‌క్షిణామూర్తి స్వామివారి హోమం జ‌రుగ‌నుంది.

ఈ కార్యక్రమంలో ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ సుబ్రమణ్యం, సూప‌రింటెండెంట్ శ్రీ భూప‌తి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ రెడ్డి శేఖ‌ర్‌, ఆలయ అర్చకులు, అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.