SUBRAMANYA SWAMY HOMAM CONCLUDES _ శ్రీ కపిలేశ్వరాలయంలో ముగిసిన శ్రీ సుబ్రహ్మణ్యస్వామివారి హోమం

TIRUPATI, 30 SEPTEMBER 2022: The month long Karthika Homa Mahotsavams witnessed Subramanyam Swamy Homam which concluded on Sunday.

In the evening Srivalli Devasena Sameta Sri Subramanya Swamy Kalyanam was also performed with celestial grandeur.

On Monday, October 31 Sri Dakshinamurty Homam will be performed.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్రీ కపిలేశ్వరాలయంలో ముగిసిన శ్రీ సుబ్రహ్మణ్యస్వామివారి హోమం

తిరుపతి, 2022 అక్టోబరు 30: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో నెల రోజుల పాటు జరుగుతున్న హోమ మహోత్సవాల్లో భాగంగా ఆదివారం శ్రీ సుబ్రహ్మణ్యస్వామివారి హోమం ఘనంగా ముగిసింది.

ఇందులో భాగంగా యాగశాలలో ఉదయం 8 నుండి 11 గంటల వరకు పూజ, హోమం, మహాపూర్ణాహుతి, కలశ ఉద్వాసన, శ్రీ సుబ్రహ్మణ్యస్వామివారికి మహాభిషేకం, కలశాభిషేకం, నివేదన, హారతి నిర్వహించారు. సాయంత్రం 5.30 గంటలకు శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి దివ్యకల్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది.

అక్టోబర్ 31న శ్రీ దక్షిణామూర్తి స్వామివారి హోమం :

హోమ మహోత్సవాల్లో భాగంగా అక్టోబర్ 31వ తేదీ సోమవారం శ్రీ దక్షిణామూర్తి స్వామివారి హోమం జరుగనుంది.

గృహస్తులు రూ.500/- చెల్లించి ఒక రోజు హోమంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, అన్నప్రసాదం అందజేస్తారు.

ఈ కార్యక్రమంలో ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ దేవేంద్ర‌బాబు, ఏఈవో శ్రీ శ్రీ‌నివాసులు, సూప‌రింటెండెంట్లు శ్రీ భూప‌తి, శ్రీ శ్రీ‌నివాసులు, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ బాల‌క్రిష్ణ‌, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.