UNION FM OFFERS PRAYERS IN TIRUCHANOOR _ శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి శ్రీమతి నిర్మల సీతారామన్

TIRUPATI, 19 OCTOBER 2022: The Union Finance Minister Smt Nirmala Sitaraman offered prayers in Tiruchanoor temple on Wednesday evening.

JEO for Health and Education Smt Sada Bhargavi accorded warm welcome on her arrival.

After darshan, she was offered Prasadams by Archakas.

MP Dr Gurumurthy, AP Finance Minister Sri Rajendranatn Reddy, DyEO Sri Lokanatham and others were present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి శ్రీమతి నిర్మల సీతారామన్

తిరుపతి 19 అక్టోబరు 2022: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీమతి నిర్మల సీతారామన్ బుధవారం రాత్రి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు.

ఆలయం వద్దకు చేరుకున్న కేంద్ర మంత్రికి టీటీడీ జేఈవో శ్రీమతి సదా భార్గవి పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. ఆలయంలో అమ్మవారి దర్శనం అనంతరం అర్చకులు శ్రీమతి నిర్మల సీతారామన్ కు తీర్థప్రసాదాలు అందించారు.

రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి శ్రీ బుగ్గన రాజేంద్ర నాథ రెడ్డి, తిరుపతి ఎంపి డాక్టర్ గురుమూర్తి, జాయింట్ కలెక్టర్ శ్రీ బాలాజి ,ఆలయ డిప్యూటి ఈవో శ్రీ లోకనాథం తదితరులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది