డిసెంబరు 3న తిరుచానూరులో వనమహోత్సవం

డిసెంబరు 3న తిరుచానూరులో వనమహోత్సవం

నవంబరు 30, తిరుపతి, 2017: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం చెంత డిసెంబరు 3వ తేదీన వనమహోత్సవం నిర్వహించనున్నారు. ఈ నెల 15 నుంచి 23వ తేదీ వరకు అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మూెత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ ఉత్సవాల విజయవంతానికి కృషి చేసిన అధికారులు, సిబ్బంది సేవలకు ప్రశంసాపూర్వకంగా ప్రతి ఏడాదీ వనమహోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.

ఇందులోభాగంగా ఆలయం వద్ద గల శుక్రవారపుతోటలో ఉదయం 10.30 నుంచి 12.30 గంటల వరకు శ్రీ పద్మావతి అమ్మవారి ఉత్సవమూర్తికి స్నపనతిరుమంజనం, ఆ తరువాత మహా నివేదన, అన్నప్రసాద వితరణ చేస్తారు. ఈ కార్యక్రమంలో అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొంటారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.