TRANSPARENT HANDLING OF LADDU COUNTERS _ పారదర్శకంగా లడ్డూ కౌంటర్ల నిర్వహణ.
Tirumala, 19, October 2021: TTD has organised transparent maintenance of all laddu counters near Srivari temple to the satisfaction and happiness of the devotees.
In a statement TTD said that of the 62 laddu counters only 31 are being operated as only limited devotees, about 25,000-30,000 are coming for Srivari Darshan every day.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
పారదర్శకంగా లడ్డూ కౌంటర్ల నిర్వహణ.
భక్తుల సంతృప్తి.
తిరుమల, 2021 అక్టోబరు 19: తిరుమల శ్రీవారి ఆలయం వద్దగల లడ్డూకౌంటర్ల నిర్వహణ పారదర్శకంగా జరుగుతోంది. రద్దీకి తగ్గట్టుగా కౌంటర్లు ఏర్పాటు చేయడంతో భక్తులు సంతృప్తిగా లడ్డూ ప్రసాదాలు స్వీకరిస్తున్నారు.
లడ్డూ కాంప్లెక్స్లో మొత్తం 62 కౌంటర్లు ఉన్నాయి. వీటిలో 55 కౌంటర్లను టెండరు ద్వారా బెంగళూరుకు చెందిన కెవిఎం ఇన్ఫో సంస్థకు టిటిడి కేటాయించింది. కోవిడ్ నేపథ్యంలో తిరుమలకు ఇంకా పూర్తిస్థాయిలో భక్తులను అనుమతించకపోవడంతో రోజుకు 25 వేల నుండి 30 వేల మంది వరకు భక్తులు దర్శనానికి వస్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం 31 లడ్డూ కౌంటర్లను నడుపుతున్నారు. వీటిలో 26 కౌంటర్లకు 6 బ్యాంకులు స్పాన్సర్షిప్ అందించాయి. బ్యాంకులు ఒక్కో కౌంటర్కు నెలకు సుమారు రూ.40,365/-లు స్పాన్సర్షిప్గా చెల్లిస్తున్నాయి. ఇండియన్ బ్యాంకు 10, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు 5, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 3, కెనరా బ్యాంకు 3, ఫెడరల్ బ్యాంకు 3, తిరుమల బ్యాంకు 2 కౌంటర్లకు స్పాన్సర్షిప్ చేశాయి. తగినన్ని లడ్డూ కౌంటర్లు ఉండడంతో భక్తులు ఎలాంటి ఆలస్యం లేకుండా ప్రసాదాలు కొనుగోలు చేస్తున్నారు.
టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.