APPALAYAGUNTA BRAHMOTSAVAMS _ మే 31 నుండి జూన్ 8వ తేదీ వ‌రకు అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు

TIRUPATI, 17 MAY 2023:  The annual Brahmotsavams in Appalayagunta will be conducted by TTD between May 31 and June 8.

Koil Alwar Tirumanjanam will be held on May 23 while Ankurarpanam on May 30. The important days includes Kalyanotsavam on June 3, Garuda Vahanam on June 4, Rathotsavam on June 7 and Chakra Snanam on June 8.

The Grihastas participating in Kalyanam have to pay Rs.500 on which two persons will be allowed. The Kalyanam will be held between 4:30pm and 7pm.

Everyday in the morning the Vahana sevas takes place between 8am and 9am while in the evening between 7pm and 8pm.

The devotional cultural programmes by HDPP, Annamacharya and Dasa Sahitya projects are arranged everyday.

  

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

మే 31 నుండి జూన్ 8వ తేదీ వ‌రకు అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి 
బ్రహ్మోత్సవాలు
 
తిరుపతి 17, మే 2023: అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు మే 31 నుండి జూన్ 8వ తేదీ వ‌రకు జ‌రుగ‌నున్నాయి. ఇందుకోసం మే 23వ తేదీ మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం, మే 30వ తేదీ సాయంత్రం అంకురార్పణ నిర్వ‌హిస్తారు. వాహనసేవల వివరాలు ఇలా ఉన్నాయి.
 
31-05-2023  ధ్వజారోహణం -పెద్దశేష వాహనం
 
01-06-2023   చిన్నశేష వాహనం   హంస వాహనం
 
02-06-2023      సింహ వాహనం  ముత్యపుపందిరి వాహనం
 
03-06-2023  కల్పవృక్ష వాహనం కల్యాణోత్సవం, సర్వభూపాల వాహనం
 
04-06-2023   మోహినీ అవతారం గరుడ వాహనం
 
05-06-2023 హనుమంత వాహనం  గజ వాహనం
 
06-06-2023        సూర్యప్రభ వాహనం   చంద్రప్రభ వాహనం
 
07-06-2023        రథోత్సవం   అశ్వవాహనం
 
08-06-2023     చక్రస్నానం  ధ్వజావరోహణం
 
బ్రహ్మోత్సవాల్లో ఉదయం 8 గంటల నుండి 9 గంటల వరకు, రాత్రి 7 గంటల నుండి 8 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయి. జూన్ 3వ తేదీ సాయంత్రం 4.30 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు స్వామివారి కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. రూ.500/- చెల్లించి గృహస్తులు(ఇద్దరు) ఈ కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, ఒక లడ్డు, ఒక అప్పం బహుమానంగా అందజేస్తారు.
 
ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌, దాససాహిత్య ప్రాజెక్టు, అన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజు ఆధ్యాత్మిక, భక్తి సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు, కోలాటాలు నిర్వహించనున్నారు.
 
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.