KOIL ALWAR TIRUMANJANAM HELD _ శ్రీవారి ఆలయంలో ఘనంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

TIRUMALA, 12 JULY 2022: The traditional temple cleaning fete Koil Alwar Tirumanjanam was held with utmost religious fervour in Tirumala temple on Tuesday.

Speaking on the occasion, the TTD EO Sri AV Dharma Reddy said, this fete is performed four times in a year on the preceding Tuesday before Telugu Ugadi, Anivara Asthanam, annual Brahmotsavams and Vaikunta Ekadasi. Today this fete was performed in connection with Anivara Asthanam on July 17.

“An aromatic medicinal mixture called Parimalam is applied on the walls, roofs and smeared on entire temple premises which acts as a disinfectant”, he maintained.

TTD board members Sri K Rambhupal Reddy, Sri Maruti Prasad, Sri Sanath Kumar, Sri Madhusudhan Yadav, SE 2 Sri Jagadeeshwar Reddy, DyEE Sri Venugopal, VGO Sri Bali Reddy and other officials were also present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీవారి ఆలయంలో ఘనంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

తిరుమల, 2022 జూలై 12: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మంగళవారంనాడు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనాన్ని ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా టీటీడీ ఈవో శ్రీ ఏవి. ధర్మారెడ్డి మాట్లాడుతూ ఈ నెల 17న ఆణివార ఆస్థానం పర్వదినాన్ని పురస్కరించుకుని ముందుగా వచ్చే మంగళవారంనాడు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం ఆగమోక్తంగా నిర్వహించినట్లు తెలిపారు. సంవత్సరంలో నాలుగు ప‌ర్వ‌దినాలైన ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మూెత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం ఈ కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని చెప్పారు. తిరుమంజ‌నం అనంత‌రం స్వామివారి మూలవిరాట్టుకు ఆలయ అర్చకులు ఆగమోక్తంగా పూజాది కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించినట్లు తెలిపారు.

ఇందులో భాగంగా ఆలయంలోని ఆనందనిలయం మొదలుకొని బంగారువాకిలి వరకు, శ్రీవారి ఆలయం లోపల ఉప ఆలయాలు, ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజసామాగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుభ్రం చేశారు. ఈ సమయంలో స్వామివారి మూలవిరాట్టును శ్వేత వస్త్రంతో పూర్తిగా కప్పి ఉంచారు. శుద్ధి పూర్తి అయిన తర్వాత నామకోపు, శ్రీ చూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలీ గడ్డ తదితర వాటితో తయారుచేసిన పరిమళ లేపనంతో ఆలయగోడలకు సంప్రోక్షణ చేసినట్లు తెలిపారు. ఆనంద నిలయం మొదలుకొని బంగారు వాకిలి వరకు అత్యంత పవిత్రంగా ఒక మహా యజ్ఞంలా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి, శ్రీ మారుతి ప్రసాద్, శ్రీ సనత్ కుమార్, శ్రీ మధుసూదన్ యాదవ్,
ఎస్ ఇ-2 శ్రీ జగదీశ్వర్ రెడ్డి, డిప్యూటీ ఈఈ శ్రీ వేణుగోపాల్, విజివో శ్రీ బాలిరెడ్డి, ఇతర అధికారులు, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.