ANKURARPANAM PERFORMED FOR PAVITHROTSAVAMS AT THONDAMANPURAM _ తొండమాన్‌పురం శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో శాస్త్రోక్తంగా పవిత్రోత్సవాలకు అంకురార్పణ

Tirupati, 25 August 2026: The sacred Ankurarpanam ritual for the annual three-day Pavithrotsavams was performed ceremoniously on Tuesday evening at 6 PM at the Sri Venkateswara Swamy Temple (along with Sridevi and Bhudevi) in Thondamanpuram.

As part of the festival schedule, Pavitra Pratistha will be performed on August 26 morning, followed by Vedic rituals in the Yagasala in the evening. On August 27, Pavitra Samarpana will take place in the morning followed by Chatushtanarchana in the evening.

The festival will conclude on August 28 with Maha Purnahuti, Pavitra Vitarana, Snapana Tirumanjanam, and Chakra Snanam in the morning, followed by Gramotsavam in the evening.

The annual Pavithrotsavams are conducted every year in accordance with Agama scriptures to rectify any inadvertent lapses or errors committed by pilgrims or staff, thereby preserving the sanctity of the temple.

Superintendent Sri Gnana Prakash, Temple Inspector Sri Anil, and temple priests participated in the event.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER

తొండమాన్‌పురం శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో శాస్త్రోక్తంగా పవిత్రోత్సవాలకు అంకురార్పణ

మూడు రోజుల పాటు ఆగమశాస్త్రోక్తంగా పవిత్రోత్సవాలు

తిరుపతి, 2026 ఆగస్టు 25: తొండమాన్‌పురంలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలకు మంగళవారం సాయంత్రం 6 గంటలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు.

పవిత్రోత్సవాల్లో భాగంగా ఆగస్టు 26న ఉదయం పవిత్ర ప్రతిష్ఠ, సాయంత్రం యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఆగస్టు 27న ఉదయం పవిత్ర సమర్పణ, సాయంత్రం చతుష్టానార్చన చేపడతారు. ఆగస్టు 28న ఉదయం మహా పూర్ణాహుతి, పవిత్ర వితరణ, స్నపన తిరుమంజనం, చక్రస్నానం నిర్వహించి పవిత్రోత్సవాలను ముగించనున్నారు. అనంతరం సాయంత్రం గ్రామోత్సవం నిర్వహిస్తారు.

యాత్రికులు, సిబ్బంది వల్ల తెలియక జరిగే దోషాల కారణంగా ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం కలగకుండా నివారించేందుకు ప్రతి ఏడాది మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలను ఆగమశాస్త్రోక్తంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.

ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ శ్రీ జ్ఞాన ప్రకాష్, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ అనిల్, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది