ANNABHISHEKAM HELD AT SRI KAPILESWARA SWAMY TEMPLE _ శ్రీ కపిలేశ్వరాలయంలో అన్నాభిషేకం
TIRUPATI, 08 NOVEMBER 2022: Sri Kapileswara Swamy temple, Annabhishekam was performed during wee hours between 3:30am and 5:30am. Devotees were provided Annalinga Darshanam till 7:30am.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
శ్రీ కపిలేశ్వరాలయంలో ఘనంగా అన్నాభిషేకం
తిరుపతి, 2022 నవంబరు 08: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని మంగళవారం అన్నాభిషేకం ఘనంగా జరిగింది. చంద్రగ్రహణం కారణంగా ఉదయం 8.30 గంటలలోపే ఈ మొత్తం కార్యక్రమాన్ని పూర్తి చేశారు.
ఈ సందర్భంగా ఉదయం 3 నుంచి 3.30 గంటల వరకు ఏకాంతంగా శుద్ధోధక అభిషేకం, ఉదయం 3.30 నుంచి 5.30 గంటల వరకు ఏకాంతంగా అన్నాభిషేకం, దీపారాధన చేపట్టారు. ఉదయం 5.30 నుంచి 7.30 గంటల వరకు భక్తులకు అన్నలింగ దర్శనం కల్పించారు. ఉదయం 7.30 నుంచి 8 గంటల వరకు ఏకాంతంగా అన్నలింగ ఉద్వాసన చేపట్టారు. శుద్ధి అనంతరం ఉదయం 8 నుండి 8.30 గంటల వరకు సుగంధద్రవ్య అభిషేకం ఏకాంతంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ దేవేంద్రబాబు, ఏఈవో శ్రీ శ్రీనివాసులు, సూపరింటెండెంట్ శ్రీ భూపతి, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ బాలకృష్ణ, ఆలయ అర్చకులు, అధికారులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.