SRI MALAYAPPA RIDES FLOAT _ తెప్పపై శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారి క‌టాక్షం

Tirumala, 15 Mar. 22: On the third day evening as part of ongoing Teppotsavams in Tirumala, Sri Malayappa Swamy accompanied by Sridevi and Bhudevi blessed pilgrims on the finely decked float.

The deities took pleasure ride along the holy waters of Swamy Pushkarini on the pleasant evening of Tuesday.

HH Tirumala Sri Chinna Jeeyar Swamy and TTD officials including SE 2 Sri Jagadeeshwar Reddy, Temple DyEO Sri Ramesh Babu, VGO Sri Bali Reddy, and Temple Peishkar Sri Srihari were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

తెప్పపై శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారి క‌టాక్షం

తిరుమల, 2022 మార్చి 15: తిరుమల శ్రీవారి వార్షిక తెప్పోత్సవాల్లో భాగంగా మూడో రోజు మంగ‌ళ‌వారం శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారు తెప్పలపై భక్తులను క‌టాక్షించారు.

ముందుగా స్వామి, అమ్మవారి ఉత్సవమూర్తులను శ్రీవారి ఆలయ నాలుగు మాడ వీధుల్లో వైభవంగా ఊరేగించి శ్రీవారి పుష్కరిణి వద్దకు తీసుకొచ్చారు. విద్యుద్దీపాలతో స‌ర్వాంగ సుంద‌రంగా అలంకరించిన తెప్పపై రాత్రి 7 గంటల నుండి 8 గంట‌ల వ‌ర‌కు శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారు ఆశీనులై పుష్కరిణిలో మూడు చుట్లు విహరించి భ‌క్తుల‌ను అనుగ్ర‌హించారు. వేదం, గానం, నాదం మ‌ధ్య తెప్పోత్స‌వం వేడుక‌గా జ‌రిగింది.

కాగా, శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ మలయప్పస్వామివారు నాలుగో రోజు ఐదు చుట్లు, చివ‌రి రోజు ఏడు చుట్లు తెప్పపై విహ‌రించి భక్తులను అనుగ్రహిస్తారు.

ఈ కార్యక్రమంలో టిటిడి శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, ఎస్ఇ-2 శ్రీ జగదీశ్వర్ రెడ్డి, శ్రీ‌వారి ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ ర‌మేష్‌బాబు, పేష్కార్ శ్రీ శ్రీహరి, విజిఓ శ్రీ బాలిరెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.