VASANTHOTSAVAM COMMENCES _ తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలు ప్రారంభం

TIRUPATI, 04 MAY 2023: The annual Vasanthotsavams commenced on a grand religious note at Sri Padmavathi Ammavari temple at Tiruchanoor on Thursday.

 

The Snapana Tirumanjanam was carried out in the Friday Gardens to the processional deity of Sri Padmavati Ammavaru between 2.30pm and 3.30pm. 

 

On the second day, there will be Swarna Rathotsavam at 9am.

 

CEO SVBC Sri Shanmukh Kumar, DyEO Sri Govindarajan and other temple staff, devotees were present.

 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

 

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలు ప్రారంభం

– మే 5న స్వర్ణరథోత్సవం

తిరుపతి, 2023 మే 04: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక వసంతోత్సవాలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. మొదటిరోజు మధ్యాహ్నం శుక్రవారపుతోటలో స్నపనతిరుమంజనం వేడుక‌గా జ‌రిగింది. మే 5న ఉదయం 9.10 గంట‌లకు స్వర్ణ రథోత్సవం కన్నులపండువగా జరుగనుంది.

వసంత ఋతువులో మేషరాశిలో సూర్యుడు ఎక్కువ ప్రకాశవంతంగా ఉంటాడు. సూర్యకిరణాల వేడి వల్ల జీవులకు వ్యాధి బాధలు కలుగుతాయి. లోకమాత అయిన శ్రీ పద్మావతి అమ్మవారిని వసంతోత్సవాల ద్వారా ఆరాధించడం వల్ల శారీరక, మానసిక తాపాలు తొలగుతాయి.

వైభవంగా స్నపనతిరుమంజనం

వసంతోత్సవాల్లో భాగంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన నిర్వహించారు. మధ్యాహ్నం 2.30 గంటలకు అమ్మవారి ఉత్సవర్లను ఆలయం నుండి శుక్రవారపు తోటకు ఊరేగింపుగా తీసుకెళ్లారు. 2.30 నుండి 4.30 గంటల వరకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో భాగంగా పసుపు, కుంకుమ, పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్లతో అభిషేకం చేశారు. సాయంత్రం అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక సంగీత కార్యక్రమాలు జరిగాయి. రాత్రి 7.30 నుండి 8.30 గంటల వరకు అమ్మవారిని ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగించనున్నారు.

భక్తులు ఒక్కొక్కరు రూ.150/- చెల్లించి ఒక రోజు వసంతోత్సవంలో పాల్గొనవచ్చు. వసంతోత్సవం కార‌ణంగా గురువారం క‌ల్యాణం, సహ‌స్ర‌దీపాలంకార‌సేవ‌లు ర‌ద్ద‌య్యాయి.

కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ గోవింద రాజన్, ఎస్వీబీసీ సిఈవో శ్రీ షణ్ముఖ కుమార్, గార్డెన్ సూపరింటెండెంట్ శ్రీ శ్రీనివాసులు,ఏఈవో శ్రీ ప్రభాకర్ రెడ్డి, అర్చకులు శ్రీ బాబుస్వామి, సూప‌రింటెండెంట్ శ్రీ శేషగిరి, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్ శ్రీ సుభాష్ పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.