AP MINISTER OFFERS SILKS _ ఒంటిమిట్ట రామయ్యకు పట్టువస్త్రాలు సమర్పించిన రాష్ట్ర మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు, ముత్యాల తలంబ్రాలు సమర్పించిన ఉప ముఖ్యమంత్రి శ్రీ కొట్టు సత్యనారాయణ

VONTIMITTA, 05 APRIL 2023: The Honourable Minister for Energy, Forest, Environment, Science and Technology, Mines and Geology Sri Peddireddi Ramachandra Reddy on behalf of the state government offered Pattu Vastrams to Vontimitta Sri Kodanda Rama Swamy on Wednesday evening on the auspicious occasion of Sri Sita Rama Kalyanam.

 

After darshan of the presiding deity, he was offered Vedaseervachanam by temple priests followed by the presentation of Sesha Vastram, dry flower technology laminated photo of Sita Rama and Theertha Prasadams.

 

Deputy CM Sri Satyanarayana, ZP Chief Sri Amarnath Reddy, Chairman Sri YV Subba Reddy, EO Sri AV Dharma Reddy, local legislator Sri Mallikarjuna Reddy, board member Sri Ashok Kumar, JEOs Smt Sada Bhargavi, Sri Veerabrahmam and others were present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఒంటిమిట్ట రామయ్యకు పట్టువస్త్రాలు సమర్పించిన రాష్ట్ర మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు, ముత్యాల తలంబ్రాలు సమర్పించిన ఉప ముఖ్యమంత్రి శ్రీ కొట్టు సత్యనారాయణ

ఒంటిమిట్ట, 2023, ఏప్రిల్ 05: ఒంటిమిట్ట శ్రీ కోదండరాముడి కల్యాణం సంద‌ర్భంగా రాష్ట్ర మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు రాష్ట్ర ప్రభుత్వం తరపున బుధవారం ఆలయంలో స్వామివారికి పట్టువస్త్రాలు, ఉప ముఖ్యమంత్రి శ్రీ కొట్టు సత్యనారాయణ ముత్యాల తలంబ్రాలు సమర్పించారు.

ముందుగా ఆల‌యం వ‌ద్ద‌కు చేరుకున్న రాష్ట్రమంత్తులకు
టీటీడీ చైర్మ‌న్ శ్రీ వైవి.సుబ్బారెడ్డి దంపతులు ,ఈవో శ్రీ ఏవి ధర్మారెడ్డి స్వాగతం పలికారు. అర్చ‌కులు పూర్ణ‌కుంభ స్వాగ‌తం ప‌లికారు. అర్చకులు మంత్రికి తలపాగా కట్టి పళ్లెం లో పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు ఉంచారు. మంత్రి దంపతులు వీటిని ఊరేగింపుగా తీసుకుని వెళ్ళి ఆలయంలో అర్చకులకు అందించి స్వామి వారిని దర్శించుకున్నారు. మంత్రికి వేద పండితులు శేష‌వ‌స్త్రం అందించి వేదాశీర్వ‌చ‌నం చేశారు. టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి స్వామివారి తీర్థ‌ప్ర‌సాదాలు అంద‌జేశారు.

రాష్ట్ర ప్రభుత్వం తరపున ఉపముఖ్యమంత్రి శ్రీ సత్యనారాయణ సీతా రాములకు ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీ ఆకేపాటి అమరనాథ రెడ్డి, శాసన సభ్యులు శ్రీ మేడా మల్లిఖార్జున రెడ్డి, శ్రీ జి. శ్రీకాంత్ రెడ్డి, టీటీడీ పాలకమండలి సభ్యులు శ్రీ పోకల అశోక్ కుమార్, శ్రీమారుతి ప్రసాద్ టీటీడీ జెఈవోలు శ్రీమతి సదా భార్గవి, శ్రీ వీర బ్రహ్మం ఉన్నారు.

అంతకు ముందు టీటీడీ అథితి గృహం వద్ద టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి, ఈవో శ్రీ ఏవి ధర్మారెడ్డి, జేఈవో లు శ్రీమతి సదా భార్గవి, శ్రీ వీర బ్రహ్మం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుష్పగుచ్చాలు అందించి స్వాగతం పలికారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.