GRAND FLOAT FESTIVAL BEGINS IN TIRUCHANOOR TEMPLE _ వైభవంగా శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాలు ప్రారంభం 

Tirupati,31 May 2023: On the Day-1 of the Teppotsavam (float festival) of Sri Padmavati temple, Tiruchanoor, Sri Krishna Swamy along with His consorts Sri Rukmini and Sri Satyabhama went round three circles in the colourfully decorated float on Wednesday evening.

 

Earlier in the morning after Nitya Kainkaryas, TTD organised a grand Abhisekam at the Mukha Mandapam. In the evening the utsava idols of Swami and Ammavaru will be paraded on the Mada streets after the float festival.

 

Dyeo Sri Govindarajan and AEO Sri Prabhakar Reddy were present.

 
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

వైభవంగా శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాలు ప్రారంభం

తిరుపతి, 2023 మే 31: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాలు బుధవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. మొదటిరోజు శ్రీ రుక్మిణి, సత్యభామ సమేత శ్రీ కృష్ణస్వామివారు పద్మసరోవరంలో తెప్పపై మూడు చుట్లు విహరించి భక్తులను అనుగ్రహించారు.

ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన, నిత్యార్చన, నిర్వహించారు. మధ్యాహ్నం 2.30 నుండి 4 గంటల వరకు శ్రీ కృష్ణస్వామివారి ముఖ మండపంలో శ్రీ కృష్ణస్వామివారికి వేడుకగా అభిషేకం నిర్వహించారు. ఇందులోభాగంగా పాలు, పెరుగు, తేనె, చందనం, సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు.

సాయంత్రం 6.30 గంటలకు స్వామి, అమ్మవారి ఉత్సవమూర్తులను పద్మపుష్కరిణి వద్దకు వేంచేపు చేశారు. సాయంత్రం 6.30 నుండి రాత్రి 7.30 గంటల వరకు తెప్పోత్సవం వైభవంగా జరిగింది. అనంతరం శ్రీ కృష్ణస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను కటాక్షించారు.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ గోవిందరాజన్, ఏఈవో శ్రీ ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.