ముగిసిన శ్రీ కోదండరామస్వామివారి పవిత్రోత్సవాలు
ముగిసిన శ్రీ కోదండరామస్వామివారి పవిత్రోత్సవాలు తిరుపతి, 2012 జూలై 16: తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయ పవిత్రోత్సవాలు సోమవారం రాత్రి పూర్ణాహుతితో ఘనంగా ముగియనున్నాయి. ముందుగా స్వామివారిని ఉదయం సుప్రభాతంతో మేల్కొలిపి తోమాల సేవ, సహస్రనామార్చన నిర్వహించారు. ఉదయం 11.00 గంటలకు ఉత్సవ మూర్తులకు స్నపనతిరుమంజనం వైభవంగా జరిగింది. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్లు, పలురకాల పండ్ల రసాలతో అభిషేకం నిర్వహించారు. సాయంత్రం 4.00 గంటల నుండి 5.00 గంటల వరకు స్వామివార్లకు వస్త్ర […]
